News October 21, 2024
గ్రూప్-1 మెయిన్స్.. మ.1.30 గంటల తర్వాత నో ఎంట్రీ

TG: అభ్యర్థుల ఆందోళనలు, ప్రభుత్వ పట్టుదల నడుమ మరికొన్ని గంటల్లో గ్రూప్-1 మెయిన్స్ ప్రారంభం కానున్నాయి. అభ్యర్థులు పరీక్ష ప్రారంభానికి కనీసం 30 నిమిషాల ముందే కేంద్రాలకు చేరుకోవాలని అధికారులు సూచించారు. మ.12.30 నుంచి 1.30 గంటల వరకు అనుమతిస్తామని పేర్కొన్నారు. ఆ తర్వాత వచ్చేవారిని అనుమతించబోమని స్పష్టంచేశారు. పరీక్షలకు సంబంధించి అనుమానాలపై 040-23452185, 040-23452186 నంబర్లలో సంప్రదించాలని తెలిపారు.
Similar News
News April 17, 2026
5 మ్యాచుల్లో 0 వికెట్లు.. బుమ్రా పేలవ ప్రదర్శన

MI స్టార్ బౌలర్ బుమ్రా పేలవ ప్రదర్శన కొనసాగుతోంది. తన పదునైన బౌలింగ్తో T20 WC గెలుపులో కీలక పాత్ర పోషించిన ఈ యార్కర్ల కింగ్ IPLలో మాత్రం తేలిపోతున్నారు. ఈ సీజన్లో ఇప్పటిదాకా ఆడిన 5 మ్యాచుల్లో ఒక్క వికెట్ కూడా తీయకపోవడం గమనార్హం. పైగా పరుగులు భారీగా సమర్పించుకుంటున్నారు. నిన్నటి మ్యాచ్లో ముంబై 195 పరుగులు చేసినా ఓడిపోయింది. పరోక్షంగా ఇందుకు బుమ్రా కూడా కారణం. 4 ఓవర్లలో 41 పరుగులు ఇచ్చారు.
News April 17, 2026
5 మ్యాచుల్లో 0 వికెట్లు.. బుమ్రా పేలవ ప్రదర్శన

MI స్టార్ బౌలర్ బుమ్రా పేలవ ప్రదర్శన కొనసాగుతోంది. తన పదునైన బౌలింగ్తో T20 WC గెలుపులో కీలక పాత్ర పోషించిన ఈ యార్కర్ల కింగ్ IPLలో మాత్రం తేలిపోతున్నారు. ఈ సీజన్లో ఇప్పటిదాకా ఆడిన 5 మ్యాచుల్లో ఒక్క వికెట్ కూడా తీయకపోవడం గమనార్హం. పైగా పరుగులు భారీగా సమర్పించుకుంటున్నారు. నిన్నటి మ్యాచ్లో ముంబై 195 పరుగులు చేసినా ఓడిపోయింది. పరోక్షంగా ఇందుకు బుమ్రా కూడా కారణం. 4 ఓవర్లలో 41 పరుగులు ఇచ్చారు.
News April 17, 2026
మహిళా రిజర్వేషన్ చట్టాన్ని అమల్లోకి తెచ్చిన కేంద్రం

చట్టసభల్లో మహిళలకు 33% కోటాను కల్పించే మహిళా రిజర్వేషన్ చట్టం నిన్నటి నుంచే అమల్లోకి వచ్చింది. ఏప్రిల్ 16ను చట్టం అమలు తేదీగా ప్రకటిస్తూ కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. 2029లో అమలు చేసేందుకు సంబంధించి ఇదే చట్టాన్ని సవరించాలని పార్లమెంటులో చర్చ జరుగుతున్న సమయంలోనే నోటిఫై చేయడం గమనార్హం. సాంకేతిక కారణాల వల్లే ఇలా చేసినట్లు ఓ అధికారి చెప్పారు. ఇదో విచిత్రమైన చర్య అని కాంగ్రెస్ మండిపడింది.


