News October 21, 2024
వర్షాలకు దెబ్బతిన్న రోడ్లు.. త్వరలో నియోజకవర్గాలకు నిధులు!
TG: వర్షాల వల్ల దెబ్బతిన్న రోడ్లకు మరమ్మతులు, కొత్త రహదారుల నిర్మాణాలపై ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. పంచాయతీరాజ్ శాఖ పరిధిలో 1,320KM మేర మరమ్మతులు చేయాల్సి ఉండగా రూ.1,375 కోట్లు అవసరమని అంచనా వేసింది. R&B పరిధిలో 2,555KM రోడ్లు ధ్వంసం కాగా రూ.2,500 కోట్లు కావాలని తేల్చింది. నియోజకవర్గాల వారీగా ఆ నిధులను త్వరలోనే రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తోంది. అందుకు కేంద్ర సహకారమూ కోరనుంది.
Similar News
News October 21, 2024
ఘోరం.. తండ్రి అప్పు కట్టలేదని కుమార్తెపై అత్యాచారం
సిలికాన్ సిటీ బెంగళూరులో దారుణం జరిగింది. తండ్రి అప్పు కట్టలేదని అతని మైనర్ కుమార్తెపై ఓ వడ్డీ వ్యాపారి అత్యాచారానికి పాల్పడ్డాడు. రవికుమార్ అనే వ్యాపారి వద్ద బాలిక తండ్రి రూ.70 వేలు తీసుకుని రూ.30వేలు తిరిగిచ్చాడు. మిగతా రూ.40వేలు, వడ్డీ కోసం రవికుమార్ నిత్యం వాళ్ల ఇంటికి వెళ్లేవాడు. నిన్న ఇంట్లో ఎవరూ లేని సమయంలో అప్పు చెల్లించాలని బాలికను బెదిరించడంతో పాటు అత్యాచారానికి ఒడిగట్టాడు.
News October 21, 2024
NZ లేడీ సూపర్ స్టార్
టీ20 వరల్డ్ కప్-2024 విజేతగా న్యూజిలాండ్ నిలిచింది. ఈ సిరీస్ మొత్తంలో బ్యాట్ & బాల్తో టీమ్ గెలుపులో కీలకంగా మారిన ఆల్ రౌండర్ అమేలియా కెర్ను ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ వరించింది. టోర్నీలో ఆమె 15 వికెట్లు పడగొట్టి సింగిల్ T20 WC ఎడిషన్లో అత్యధిక వికెట్లు తీసిన ప్లేయర్గా నిలిచారు. ఈ టోర్నీలో ఆమె తీసిన వికెట్లు వరుసగా.. 1/19 vs IND, 4/26 vs AUS, 2/13 vs SL, 3/14 vs PAK, 2/14 vs WI, 3/24 vs SA (Finals).
News October 21, 2024
మాల్దీవ్స్ వెళ్లే భారతీయులకు గుడ్న్యూస్
మాల్దీవ్స్కు వెళ్లే భారతీయులకు ప్రెసిడెంట్ ముయిజ్జు గుడ్న్యూస్ చెప్పారు. అక్కడ UPI పేమెంట్స్ వ్యవస్థను అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించారు. దీంతో అక్కడ పేమెంట్స్ చేయడం భారతీయులకు సులభతరం కానుంది. డిజిటల్ పేమెంట్స్, ఫైనాన్షియల్ సర్వీసెస్లో సహకారం అందించేందుకు భారత్ అంగీకరించిన నేపథ్యంలో మాల్దీవ్స్లో యూపీఐ పేమెంట్స్ తీసుకురావాలని ఆయన నిర్ణయించారు.