News October 21, 2024
బాంబు బెదిరింపు కాల్స్: రూల్స్ మారుస్తున్న కేంద్రం

బెదిరింపు కాల్స్తో విమానాలకు అంతరాయాలు కలగకుండా కేంద్రం రూల్స్ మారుస్తోంది. ప్యాసింజర్, కార్గో సహా సెకండరీ లాడార్ పాయింట్ల వద్ద హ్యాండ్ బ్యాగుల చెకింగ్ ముమ్మరం చేయనుంది. మెసేజులు పెడుతున్న వారిని పట్టుకొనేందుకు VPN ప్రొవైడర్లతో కలిసి పనిచేయనుంది. SMలో ఒకే అకౌంట్ నుంచి ఎక్కువ మెసేజెస్ పెట్టి గంటల్లోనే డిలీట్ చేయడాన్ని గమనించిన సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ (BCAS) సైబర్ టీమ్స్ను అలర్ట్ చేసింది.
Similar News
News November 12, 2025
MIDHANIలో 210 పోస్టులు

మిశ్రమ ధాతు నిగమ్(<
News November 12, 2025
చైనాకు భారత జనరిక్ మెడిసిన్!

భారత్ విషయంలో చైనా క్రమంగా నిబంధనలు సడలిస్తోంది. జనరిక్ ఔషధాలను దిగుమతి చేసుకునేందుకు ఆసక్తి చూపిస్తోంది. గత నెలలో నిర్వహించిన టెండర్లో సిప్లా, నాట్కో, హెటిరో, రెడ్డీస్ వంటి ఫార్మా సంస్థలు చైనా ప్రభుత్వ నిర్వహణలోని ఆసుపత్రులకు జనరిక్ మందులను సరఫరా చేసే కాంట్రాక్ట్ దక్కించుకున్నాయి. ఈ సంస్థలు ‘డపాగ్లిఫ్లోజిన్’ అనే మధుమేహ నియంత్రణ టాబ్లెట్లను సప్లై చేయనున్నాయి. ఇతర టాబ్లెట్లూ సరఫరా చేయనున్నాయి.
News November 12, 2025
నాగార్జునపై కామెంట్స్.. అర్ధరాత్రి సురేఖ ట్వీట్

TG: హీరో నాగార్జున, ఆయన కుటుంబంపై <<14263103>>గతంలో<<>> తాను చేసిన వ్యాఖ్యల పట్ల పశ్చాత్తాపం వ్యక్తం చేస్తున్నానని మంత్రి కొండా సురేఖ ట్వీట్ చేశారు. వారిని కించపరచాలన్న ఉద్దేశం తనకు లేదన్నారు. వారు బాధపడి ఉంటే అందుకు చింతిస్తున్నానని, ఆ వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నానని రాసుకొచ్చారు. అయితే అసందర్భంగా అర్ధరాత్రి 12 గం.కు సురేఖ ట్వీట్ చేయడం చర్చకు దారితీసింది. కాగా ఆమెపై నాగ్ వేసిన పరువునష్టం కేసు కొనసాగుతోంది.


