News October 21, 2024

దివ్వెల మాధురికి పోలీసుల నోటీసులు

image

AP: వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ సన్నిహితురాలు దివ్వెల మాధురికి తిరుమల పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఇటీవల తిరుమల వెళ్లిన మాధురి అక్కడ ఫొటోషూట్స్, రీల్స్ చేశారంటూ టీటీడీ అధికారులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు<<14326522>> కేసు నమోదైంది<<>>. దీంతో తిరుమల వన్ టౌన్ పోలీసులు టెక్కలిలోని అక్కవరం సమీపంలో శ్రీనివాస్, మాధురి ఉంటున్న ఇంటికి వెళ్లి ఆమెకు నోటీసులిచ్చారు.

Similar News

News January 29, 2026

మహారాష్ట్ర డిప్యూటీ సీఎంగా సునేత్రా పవార్?

image

దివంగత అజిత్ పవార్ స్థానంలో ఆయన భార్య సునేత్రా పవార్‌ను మహారాష్ట్ర Dy.CMగా ప్రతిపాదించాలని NCP యోచిస్తోంది. పార్టీ సీనియర్ నేతలు ఇప్పటికే ఆమెతో చర్చలు జరిపారు. అజిత్ మరణంతో ఖాళీ అయిన బారామతి నుంచి ఆమె పోటీ చేసే అవకాశం ఉంది. పార్టీ అధ్యక్షుడిగా ప్రఫుల్ పటేల్ బాధ్యతలు తీసుకోనున్నట్లు సమాచారం. ఈ వ్యవహారాలు పూర్తైన తర్వాతే శరద్ పవార్ నేతృత్వంలోని NCP(SP)లో విలీనంపై చర్చలు జరగొచ్చని తెలుస్తోంది.

News January 29, 2026

కల్తీకి కేరాఫ్ అడ్రస్ జగన్: మంత్రి సవిత

image

AP: తిరుమల వేంకన్న ఆస్తులు కొట్టేయాలన్న కుట్రతో పవిత్రమైన లడ్డూ ప్రసాదాన్ని జగన్ కల్తీ చేయించారని మంత్రి సవిత మండిపడ్డారు. పామాయిల్, ఇతర కెమికల్స్‌తో లడ్డూ కల్తీ జరిగిందని, నెయ్యి లేదని సిట్ స్పష్టం చేసిందన్నారు. జంతుకొవ్వు లేదు కదా అని చేసిన తప్పు కప్పిపుచ్చుకోడానికి YCP బ్యాచ్ బుకాయిస్తోందని ఫైరయ్యారు. కల్తీకి కేరాఫ్ అడ్రస్ జగన్ అని, కల్తీ విషయంలో చట్టం తన పని తాను చేసుకుపోతుందని పేర్కొన్నారు.

News January 29, 2026

మేడిగడ్డ బ్యారేజీకి కేంద్రం రెడ్ అలర్ట్

image

TG: కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీ తీవ్ర ముప్పులో ఉందని కేంద్రం తేల్చింది. ఈ మేరకు దాన్ని అత్యంత ప్రమాదకరమైన కేటగిరీ-1లో చేర్చింది. ఈ విషయాన్ని కేంద్ర జల్ శక్తి శాఖ లోక్‌సభకు తెలిపింది. లోపాలను తక్షణమే సరిచేసి బ్యారేజీని పటిష్టం చేయాలని NDSA సిఫార్సు చేసిందని పేర్కొంది. మన్నిక పెరిగేలా చర్యలు చేపట్టాలని రాష్ట్రానికి సూచించింది. ఖజూరి (UP), బొకారో (ఝార్ఖండ్) ఇదే కేటగిరీలో ఉన్నాయి.