News October 21, 2024

వాలంటీర్ హత్య కేసు.. మాజీ మంత్రి కుమారుడు అరెస్ట్

image

AP: మాజీ మంత్రి, YCP నేత పినిపె విశ్వరూప్ కుమారుడు శ్రీకాంత్‌ను పోలీసులు మదురైలో అరెస్ట్ చేశారు. కోనసీమ అల్లర్ల సమయంలో(2022 జూన్ 6న) అయినవిల్లికి చెందిన వాలంటీర్ దుర్గాప్రసాద్ హత్యకు గురయ్యారు. ఈ కేసులో ఇప్పటికే YCP సోషల్ మీడియా కన్వీనర్ ధర్మేశ్‌ను అరెస్ట్ చేశారు. విచారణలో శ్రీకాంత్ పేరు బయటికి రావడంతో తాజాగా అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఇవాళ శ్రీకాంత్‌ను కోర్టులో హాజరుపర్చనున్నారు.

Similar News

News October 21, 2024

పత్తి రైతులను మోసం చేస్తే చర్యలు: మంత్రి తుమ్మల

image

TG: రాష్ట్రంలో అన్ని పంటలకు ప్రభుత్వమే మద్దతు ధర ఇస్తుందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఖమ్మం(D) గుర్రాలపాడులో పత్తి కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. కష్టమైన నష్టమైనా ప్రభుత్వం పంట కొనుగోళ్లు చేస్తుందని చెప్పారు. పత్తి రైతులను మోసం చేసే ప్రైవేట్ వ్యాపారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రైతులు ఉద్యానవన పంటలపై దృష్టి సారించాలని మంత్రి సూచించారు.

News October 21, 2024

స్వల్పంగా పెరిగిన గోల్డ్ రేట్స్

image

బంగారం ధరలు మరోసారి పైపైకి ఎగబాకుతున్నాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఇవాళ 24 క్యారెట్ల గోల్డ్ 10 గ్రాములకు రూ.220 పెరిగి రూ.79,640కు చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి రూ.200 పెరిగి రూ.73,000గా నమోదైంది. అటు సిల్వర్ రేట్ దూసుకెళ్తోంది. నిన్నటి వరకు రూ.1,07,000 ఉండగా ఇవాళ మరో రూ.2000 పెరిగింది. దీంతో కేజీ సిల్వర్ రేట్ రూ.1,09,000కి చేరింది.

News October 21, 2024

హైకోర్టులోనే తేల్చుకోండి: SC

image

TG: గ్రూప్-1 మెయిన్స్ రీషెడ్యూల్, జీవో 29 రద్దు పిటిషన్‌పై జోక్యం చేసుకోబోమన్న సుప్రీంకోర్టు ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ దశలో తాము జోక్యం చేసుకోలేమని, హైకోర్టులోనే తేల్చుకోవాలని పిటిషనర్లకు సూచించింది. అటు ఫలితాల వెల్లడికి, నవంబర్ 20కి ముందే తుది తీర్పు ఇవ్వాలని హైకోర్టును ఆదేశించింది. తుది తీర్పునకు లోబడే నియామకాలు ఉంటాయన్న HC వ్యాఖ్యలను కోట్ చేసింది.