News October 21, 2024

సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన

image

TG: పోలీసు అమరవీరుల సంస్మరణ సభలో CM రేవంత్ కీలక ప్రకటన చేశారు. విధి నిర్వహణలో IPSలు మరణిస్తే రూ.2 కోట్లు, డీఎస్పీ, అడిషనల్ ఎస్పీ, ఎస్పీ మరణిస్తే రూ.1.5 కోట్లు, ఎస్సై, సీఐ మరణిస్తే రూ.1.25 కోట్లు, హెడ్ కానిస్టేబుల్, కానిస్టేబుళ్లు మరణిస్తే రూ.కోటి పరిహారం ప్రకటించారు. మరణించిన వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇస్తామన్నారు. శాశ్వత వైకల్యం పొందిన అధికారుల ర్యాంక్‌ను బట్టి పరిహారం ఇస్తామని చెప్పారు.

Similar News

News July 11, 2025

తుది శ్వాస వరకు సనాతన ధర్మం కోసం పనిచేస్తా: రాజాసింగ్

image

TG: తన <<17030713>>రాజీనామాను<<>> BJP ఆమోదించడంపై రాజాసింగ్ స్పందించారు. ‘ప్రజా సేవ చేసేందుకు, హిందుత్వాన్ని కాపాడేందుకు 11yrs క్రితం BJPలో చేరాను. నన్ను నమ్మి 3 సార్లు MLA టికెట్ ఇచ్చినందుకు ధన్యవాదాలు. TGలో BJP ప్రభుత్వం రావాలని కార్యకర్తలు తీవ్రంగా శ్రమిస్తున్నారు. వారి బాధేంటో ఢిల్లీ పెద్దలకు అర్థమయ్యేలా చెప్పలేకపోయానేమో. తుది శ్వాస వరకు సనాతన ధర్మాన్ని రక్షించేందుకు పనిచేస్తా’ అని ట్వీట్ చేశారు.

News July 11, 2025

HCA అధ్యక్షుడే కీలక సూత్రధారి: CID

image

HCA అవకతవకల కేసు వ్యవహారంలో CID దర్యాప్తు ముమ్మరం చేసింది. ఈ కేసులో రిమాండ్‌లో ఉన్న ఐదుగురిని కస్టడీలోకి ఇవ్వాలని మల్కాజ్‌గిరి కోర్టులో పిటిషన్ వేసింది. వారిని 10 రోజులపాటు విచారించేందుకు అనుమతి ఇవ్వాలని కోరింది. ‘HCAలో అక్రమాలు జరిగాయి. కమిటీ అధ్యక్షుడు జగన్మోహనే కీలక సూత్రధారి. BCCIతోపాటు IPL నుంచి వచ్చిన నిధులను దుర్వినియోగం చేశారు’ అని CID పేర్కొంది. ఈ పిటిషన్‌పై కోర్టు ఇవాళ విచారించనుంది.

News July 11, 2025

భారత్‌పై 11వ సెంచరీ బాదిన రూట్

image

భారత్‌తో జరుగుతున్న మూడో టెస్టులో ENG స్టార్ బ్యాటర్ రూట్ సెంచరీతో చెలరేగారు. రెండో రోజు తొలి బంతికే ఫోర్ కొట్టి శతకం పూర్తి చేశారు. భారత్‌పై టెస్టుల్లో అత్యధిక సెంచరీలు చేసిన ప్లేయర్‌గా స్మిత్ సరసన చేరారు. 60 ఇన్నింగ్స్‌లలో 11 సెంచరీలు చేశారు. మొత్తంగా 37 సెంచరీలు చేసి ద్రవిడ్, స్మిత్(36)ను అధిగమించి టాప్ 5లో నిలిచారు. మరోవైపు బుమ్రా బౌలింగ్‌లో స్టోక్స్(44) ఔటయ్యారు. ప్రస్తుతం ENG స్కోర్ 265/5.