News October 21, 2024
ప.గో: రోడ్డు ప్రమాదంలో భార్యాభర్త మృతి
ఉమ్మడి ప.గో జిల్లాలో సోమవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తణుకు మండలం పైడిపర్రుకు చెందిన వెంకటేశ్వర రావు(60), దుర్గ(50) కొవ్వూరు మండలం మద్దూరులో జరిగే శుభకార్యానికి బైకుపై బయల్దేరారు. ఈక్రమంలో నిడదవోలు మండలం గోపవరం వద్ద ఆర్టీసీ బస్సు, బైక్ ఢీకొన్నాయి. ఈ ఘటనలో భార్యాభర్తలు అక్కడికక్కడే చనిపోయారు. పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.
Similar News
News October 21, 2024
ఏలూరు: కరెంట్ షాక్ తగిలి యువకుడి మృతి
ఏలూరు జిల్లాలో సోమవారం విషాద ఘటన జరిగింది. జంగారెడ్డిగూడెం మండలం పుట్లగట్ల గూడేనికి చెందిన కవులూరి చరణ్(20) గురవాయిగూడెంలో కర్ర కోత మిషన్ పనికి వెళ్లాడు. ఈక్రమంలో అక్కడ షాక్ తగిలి మృతిచెందాడు. కోత మిషన్ యజమాని మేకల గంగాధర్ తిలక్ నిర్లక్ష్యంతోనే ప్రమాదం జరిగిందని బంధువులు ఆరోపిస్తున్నారు. మృతదేహాన్ని జంగారెడ్డిగూడెం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
News October 21, 2024
ప.గో: ముగిసిన పల్లె పండగ వారోత్సవాలు
పశ్చిమగోదావరి జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన పల్లె పండగ వారోత్సవాలు ఆదివారంతో ముగిశాయి. అక్టోబర్ 14న ప్రారంభమైన ఈ వారోత్సవాలు 20వ తేదీ వరకు జిల్లాలోని ప్రతి గ్రామంలో ఆయా ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు నిర్వహించారు. ఏలూరు జిల్లాలో 2,523 అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టగా ₹.173.87 కోట్లు మంజూరు చేశారు.
News October 21, 2024
ఏలూరు: రైతుల కోసం కంట్రోల్ రూం
ఏలూరు జిల్లాలో ధాన్యం కొనుగోలు విషయమై రైతులకు తగిన సలహాలు, సమాచారం అందించేందుకు కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు జేసీ ధాత్రి రెడ్డి వెల్లడించారు. రైతులకు ఎటువంటి సమాచారం కావాలన్నా 08812-230448, 7702003584 నంబర్లను సంప్రదించాలని కోరారు. అలాగే టోల్ ఫ్రీ 18004256453కు సైతం కాల్ చేయవచ్చన్నారు. క్వింటాకి కామన్ రకం రూ.2300, గ్రేడ్-ఏ రకానికి రూ.2320 కనీస ధరగా నిర్ణయించినట్లు స్పష్టం చేశారు.