News October 21, 2024
గ్రూప్-1.. సుప్రీంకోర్టులో విచారణ ప్రారంభం
TG: గ్రూప్-1పై సుప్రీంకోర్టులో విచారణ ప్రారంభం అయింది. సీజేఐ చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. అయితే పిటిషన్ను న్యాయమూర్తి పాస్ ఓవర్ చేశారు. లిస్ట్లో పిటిషన్లపై విచారణ మొత్తం పూర్తయ్యాక దీన్ని విచారణకు స్వీకరిస్తామని చెప్పారు. కాగా గ్రూప్-1 అభ్యర్థుల తరఫున సీనియర్ లాయర్ కపిల్ సిబల్ వాదనలు వినిపించనున్నారు.
Similar News
News October 21, 2024
కాంగ్రెస్తో సీట్ల పంపకాలపై చర్చలు: అఖిలేశ్
UPలో 9 అసెంబ్లీ స్థానాలకు జరుగుతున్న ఉపఎన్నికల్లో కాంగ్రెస్తో సీట్ల పంపకాలపై చర్చలు జరుగుతున్నాయని SP చీఫ్ అఖిలేశ్ యాదవ్ తెలిపారు. అఖిలేశ్ రాజీనామాతో ఖాళీ అయిన కర్హాల్ నుంచి పార్టీ అభ్యర్థి తేజ్ ప్రతాప్ నామినేషన్ వేశారు. కర్హాల్ తమకు పట్టున్న స్థానమని, ప్రజలు చరిత్రాత్మక తీర్పిస్తారని అఖిలేశ్ పేర్కొన్నారు. మహారాష్ట్రలో సంస్థాగతంగా బలంగా ఉన్న స్థానాలను కోరుతామన్నారు.
News October 21, 2024
INDలో మొట్ట మొదటి స్కామ్ ఏంటో తెలుసా?
ఇండో-పాకిస్థాన్ యుద్ధంలో INDకి మరిన్ని జీపులు అవసరమయ్యాయి. అప్పటి బ్రిటన్లోని భారత హైకమిషనర్ VK కృష్ణ మీనన్ ప్రోటోకాల్ను పట్టించుకోకుండా కొత్తవాటి ధరకే 2వేల సెకండ్ హ్యాండ్ జీపులు ఆర్డరిచ్చారు. ఓ విదేశీ సంస్థతో రూ.80 లక్షల ఒప్పందం చేసుకున్నారు. ఆర్డర్ డెలివరీలో జాప్యం జరగడంతో వచ్చిన వాటిని రక్షణ శాఖ అంగీకరించలేదు. ప్రోటోకాల్ ఉల్లంఘించడంతో దీనిపై విచారణ జరిపి 1955లో ఈ కేసును క్లోజ్ చేశారు.
News October 21, 2024
US కంటే ఇండియా మార్కెట్ల పనితీరు భేష్: మార్క్ మోబియస్
అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థల కంటే వర్ధమాన మార్కెట్లు రెండింతల వృద్ధి రేటు సాధిస్తున్నాయని ప్రముఖ ఇన్వెస్టర్ మార్క్ మోబియస్ తెలిపారు. అమెరికా మార్కెట్ల కంటే ఇండియా మెరుగైన పనితీరు కనబర్చిందన్నారు. ‘భవిష్యత్తులో సెమీకండక్టర్ ప్రొడక్షన్లో భారత్ లీడర్గా ఎదుగుతుందనే నమ్మకముంది. అనేక పెద్ద సెమీకండక్టర్ కంపెనీలు ఇప్పటికే భారత్లో సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నాయి’ అని NDTV సమ్మిట్లో పేర్కొన్నారు.