News October 21, 2024

పత్తి రైతులను మోసం చేస్తే చర్యలు: మంత్రి తుమ్మల

image

TG: రాష్ట్రంలో అన్ని పంటలకు ప్రభుత్వమే మద్దతు ధర ఇస్తుందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఖమ్మం(D) గుర్రాలపాడులో పత్తి కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. కష్టమైన నష్టమైనా ప్రభుత్వం పంట కొనుగోళ్లు చేస్తుందని చెప్పారు. పత్తి రైతులను మోసం చేసే ప్రైవేట్ వ్యాపారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రైతులు ఉద్యానవన పంటలపై దృష్టి సారించాలని మంత్రి సూచించారు.

Similar News

News October 21, 2024

కాంగ్రెస్‌తో సీట్ల పంప‌కాల‌పై చ‌ర్చ‌లు: అఖిలేశ్‌

image

UPలో 9 అసెంబ్లీ స్థానాల‌కు జ‌రుగుతున్న ఉపఎన్నిక‌ల్లో కాంగ్రెస్‌తో సీట్ల పంప‌కాల‌పై చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయని SP చీఫ్ అఖిలేశ్ యాద‌వ్ తెలిపారు. అఖిలేశ్ రాజీనామాతో ఖాళీ అయిన క‌ర్హాల్ నుంచి పార్టీ అభ్య‌ర్థి తేజ్ ప్రతాప్ నామినేష‌న్ వేశారు. క‌ర్హాల్ త‌మ‌కు ప‌ట్టున్న స్థానమ‌ని, ప్ర‌జ‌లు చ‌రిత్రాత్మ‌క తీర్పిస్తారని అఖిలేశ్ పేర్కొన్నారు. మ‌హారాష్ట్ర‌లో సంస్థాగ‌తంగా బ‌లంగా ఉన్న స్థానాల‌ను కోరుతామ‌న్నారు.

News October 21, 2024

INDలో మొట్ట మొదటి స్కామ్ ఏంటో తెలుసా?

image

ఇండో-పాకిస్థాన్ యుద్ధంలో INDకి మరిన్ని జీపులు అవసరమయ్యాయి. అప్పటి బ్రిటన్‌లోని భారత హైకమిషనర్ VK కృష్ణ మీనన్ ప్రోటోకాల్‌ను పట్టించుకోకుండా కొత్తవాటి ధరకే 2వేల సెకండ్ హ్యాండ్ జీపులు ఆర్డరిచ్చారు. ఓ విదేశీ సంస్థతో రూ.80 లక్షల ఒప్పందం చేసుకున్నారు. ఆర్డర్ డెలివరీలో జాప్యం జరగడంతో వచ్చిన వాటిని రక్షణ శాఖ అంగీకరించలేదు. ప్రోటోకాల్ ఉల్లంఘించడంతో దీనిపై విచారణ జరిపి 1955లో ఈ కేసును క్లోజ్ చేశారు.

News October 21, 2024

US కంటే ఇండియా మార్కెట్ల పనితీరు భేష్: మార్క్ మోబియస్

image

అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థల కంటే వర్ధమాన మార్కెట్లు రెండింతల వృద్ధి రేటు సాధిస్తున్నాయని ప్రముఖ ఇన్వెస్టర్ మార్క్ మోబియస్ తెలిపారు. అమెరికా మార్కెట్ల కంటే ఇండియా మెరుగైన పనితీరు కనబర్చిందన్నారు. ‘భవిష్యత్తులో సెమీకండక్టర్ ప్రొడక్షన్‌లో భారత్ లీడర్‌గా ఎదుగుతుందనే నమ్మకముంది. అనేక పెద్ద సెమీకండక్టర్ కంపెనీలు ఇప్పటికే భారత్‌లో సాఫ్ట్‌వేర్ రంగంలో ఉన్నాయి’ అని NDTV సమ్మిట్‌లో పేర్కొన్నారు.