News October 21, 2024

రెండున్నరేళ్ల క్రితం రీరిలీజ్.. వెయ్యి రోజులుగా స్క్రీనింగ్

image

గౌతమ్ మీనన్ తెరకెక్కించిన ‘విన్నైతాండి వరువాయా’ 2010లో రిలీజై గొప్ప విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. తమిళ నటుడు శింబు, త్రిష కాంబోలో ఈ మూవీ తెరకెక్కగా దీనిని తెలుగులో ‘ఏమాయ చేశావే’గా రీమేక్ చేశారు. ఈ చిత్రాన్ని రెండున్నరేళ్ల క్రితం రీరిలీజ్ చేయగా చెన్నైలోని అన్నానగర్ PVR థియేటర్‌లో స్క్రీనింగ్ అవుతోంది. నేటికి వెయ్యి రోజులు పూర్తవడంతో సినీ అభిమానులు ఈ విషయాన్ని షేర్ చేస్తున్నారు.

Similar News

News March 15, 2025

ఎన్నికల కోసమే డీఎంకే హిందీ డ్రామా: కిషన్ రెడ్డి

image

TG: తమిళనాడులో ఎన్నికల సమయం దగ్గర పడుతోందని, అందుకే డీఎంకే పార్టీ ప్రజలను రెచ్చగొట్టి అధికారంలోకి రావాలని చూస్తోందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఫైరయ్యారు. త్రిభాషా పాలసీ కొత్తదేం కాదని, దేశంలో ఎక్కడా హిందీ భాషను రుద్దడం లేదని స్పష్టం చేశారు. తమిళ భాష అభివృద్ధికి స్టాలిన్ ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. డీలిమిటేషన్‌పైనా డీఎంకే తప్పుడు ప్రచారం చేస్తోందని విమర్శించారు.

News March 15, 2025

ఆయుర్దాయం పెరగాలంటే ఇలా చేయండి!

image

ఫ్యామిలీతో కలిసి ఎక్కువకాలం బతకాలని అందరూ కోరుకుంటారు. ఇది సాధ్యం కావాలంటే కొన్ని పనులు చేయాలని నిపుణులు చెబుతున్నారు. కడుపులో 80 శాతం నిండినంత వరకే తినాలి. టీవీ, ఫోన్ చూడకుండా నెమ్మదిగా కింద కూర్చునే తినాలి. హెర్బల్ టీ తాగాలి. రోజూ 7-8 గంటలు నిద్రపోవాలి. సమీపంలోని ప్రదేశాలకు నడక ద్వారానే వెళ్లాలి. క్రమం తప్పకుండా హెల్త్ చెకప్ చేయించుకుని వ్యాధులను గుర్తించి చికిత్స తీసుకోవాలని సూచిస్తున్నారు.

News March 15, 2025

వాళ్లే జనసేన MLAలు: అంబటి రాంబాబు

image

AP: తన సిద్ధాంతం ఏంటో తెలియని స్థితిలో Dy.CM పవన్ ఉన్నారని అంబటి రాంబాబు ఎద్దేవా చేశారు. ‘పవన్ అవకాశవాద రాజకీయాలు చేస్తున్నారు. 21 సీట్లు గెలిచి 100% స్ట్రైక్‌రేట్ అని మాట్లాడుతున్నారు. గెలిచిన వారిలో అసలైన జనసేన నేతలు ఎంతమంది? YCP టికెట్ రాని, చంద్రబాబు మనుషులే జనసేన MLAలు. 2 పార్టీలు వాపును చూసి బలం అనుకుంటున్నాయి. జనసేన MLAలు దోపిడీ చేస్తుంటే పవన్ చుక్కలు లెక్కబెడుతున్నారు’ అని విమర్శించారు.

error: Content is protected !!