News October 21, 2024
CSKతోనే ధోనీ.. ఆ జట్టు సీఈవో ఏమన్నారంటే?
ఐపీఎల్లో CSK తరఫున ఎంఎస్ ధోనీ ఆడటంపై ఆ జట్టు సీఈవో కాశీ విశ్వనాథ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మిస్టర్ కూల్ జట్టుకు ఆడాలని తాము కూడా కోరుకుంటున్నట్లు చెప్పారు. అయితే దీనిపై ధోనీ ఇంకా క్లారిటీ ఇవ్వాల్సి ఉందన్నారు. ఈ విషయమై ఈ నెల 31లోపు నిర్ణయాన్ని వెల్లడిస్తానని MS చెప్పినట్లు పేర్కొన్నారు. మరోవైపు ధోనీని అన్క్యాప్డ్ ప్లేయర్గా CSKలో తీసుకుంటారని ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే.
Similar News
News October 22, 2024
తండ్రైన భారత క్రికెటర్ సర్ఫరాజ్ ఖాన్
భారత యువ క్రికెటర్ సర్ఫరాజ్ ఖాన్ తండ్రయ్యారు. ఆయన భార్య పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు. తండ్రి, అప్పుడే పుట్టిన శిశువుతో సర్ఫరాజ్ దిగిన ఫొటో వైరల్ అవుతోంది. 26 ఏళ్ల సర్ఫరాజ్ గతేడాది ఆగస్టు 6న రొమానా జహూర్ను J&Kలో వివాహమాడారు. ఇటీవల NZపై ఈ యువ సంచలనం అద్భుత ఇన్నింగ్స్ ఆడిన విషయం తెలిసిందే.
News October 22, 2024
ఆస్ట్రేలియా టూర్కు ఇండియా-A టీమ్ ఇదే
ఆస్ట్రేలియాలో పర్యటించే ఇండియా-A జట్టును బీసీసీఐ ప్రకటించింది. రుతురాజ్ కెప్టెన్సీలోని ఈ జట్టు AUS-Aతో రెండు ఫస్ట్ క్లాస్ మ్యాచులు, భారత జట్టుతో ఒక ఇంట్రా స్క్వాడ్ మ్యాచ్ (NOV 15-17) ఆడనుంది.
>> జట్టు: రుతురాజ్ గైక్వాడ్(C), అభిమన్యు ఈశ్వరన్, సుదర్శన్, నితీశ్ కుమార్ రెడ్డి, పడిక్కల్, రికీ భుయ్, బాబా ఇంద్రజిత్, ఇషాన్ కిషన్, పోరెల్, ముకేశ్, ఖలీల్, యశ్ దయాల్, సైనీ, మనవ్, తనుశ్.
News October 21, 2024
₹1,000 కోట్లకు సగం వాటా అమ్మేసిన కరణ్ జోహార్
బాలీవుడ్లో భారీ డీల్ కుదిరింది. ప్రముఖ దర్శకుడు కరణ్ జోహార్కు చెందిన ధర్మా ప్రొడక్షన్స్లో 50% వాటాను బిజినెస్ టైకూన్ అదార్ పూనావాలా ₹1,000 కోట్లు వెచ్చించి సొంతం చేసుకున్నారు. మిగిలిన వాటా కలిగిన కరణ్ సంస్థను నడిపిస్తారు. ఐకానిక్ ప్రొడక్షన్స్ హౌస్లో భాగస్వామ్యమైనందుకు పూనావాలా సంతోషం వ్యక్తం చేశారు. ధర్మా ప్రొడక్షన్స్ను ఉన్నత శిఖరాలకు చేర్చుతామని కరణ్ పేర్కొన్నారు.