News October 21, 2024

INDలో మొట్ట మొదటి స్కామ్ ఏంటో తెలుసా?

image

ఇండో-పాకిస్థాన్ యుద్ధంలో INDకి మరిన్ని జీపులు అవసరమయ్యాయి. అప్పటి బ్రిటన్‌లోని భారత హైకమిషనర్ VK కృష్ణ మీనన్ ప్రోటోకాల్‌ను పట్టించుకోకుండా కొత్తవాటి ధరకే 2వేల సెకండ్ హ్యాండ్ జీపులు ఆర్డరిచ్చారు. ఓ విదేశీ సంస్థతో రూ.80 లక్షల ఒప్పందం చేసుకున్నారు. ఆర్డర్ డెలివరీలో జాప్యం జరగడంతో వచ్చిన వాటిని రక్షణ శాఖ అంగీకరించలేదు. ప్రోటోకాల్ ఉల్లంఘించడంతో దీనిపై విచారణ జరిపి 1955లో ఈ కేసును క్లోజ్ చేశారు.

Similar News

News October 22, 2024

లగ్జరీ ఇళ్ల విక్రయాలు భేష్!

image

దేశ వ్యాప్తంగా లగ్జరీ ఇళ్లకు డిమాండ్ పెరుగుతోంది. SEPతో ముగిసిన మూడు నెలల కాలంలో రూ.4 కోట్లకు పైగా విలువైన 12,630 యూనిట్ల అమ్మకాలు నమోదైనట్లు రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ CBRE వెల్లడించింది. గతేడాది ఇదే కాలంలో అమ్మకాలు 9,165 యూనిట్లు కాగా 38% వృద్ధి నమోదైంది. అయితే HYD, బెంగళూరులో మాత్రం అమ్మకాలు తగ్గాయి. ఆదాయం పెరగడం, సులభతర రుణ సదుపాయాలతో లగ్జరీ ఇళ్లపై పెట్టుబడులు పెడుతున్నారని CBRE తెలిపింది.

News October 22, 2024

స్కూల్ టీచర్ వేధించాడు.. ఎవరికీ చెప్పుకోలేకపోయా: సాక్షి మాలిక్

image

చిన్నతనంలో తాను ఎదుర్కొన్న కష్టాలను ఒలింపిక్ బ్రాంజ్ మెడలిస్ట్, మాజీ రెజ్లర్ సాక్షి మాలిక్ తన బుక్ ‘విట్‌నెస్’లో వెల్లడించారు. ‘ట్యూషన్ టీచర్ వేధించేవాడు. కొన్నిసార్లు నన్ను తాకేందుకు ప్రయత్నించేవాడు. దీంతో క్లాస్‌లకు వెళ్లేందుకు భయపడేదాన్ని. ఇది నా తప్పుగా భావించి పేరెంట్స్‌కు చెప్పలేకపోయా’ అని పేర్కొన్నారు. రెజ్లింగ్‌లోకి అడుగుపెట్టాక కూడా ఎప్పుడు పారిపోవాలనే ఆలోచించేదాన్నని రాసుకొచ్చారు.

News October 22, 2024

దేశీయంగా బొగ్గు ఉత్పత్తి పెరగాలి: కిషన్ రెడ్డి

image

TG: దేశంలో పవర్ డిమాండ్‌కు అనుగుణంగా ఉత్పత్తి జరగాల్సిన అవసరం ఉందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. దిగుమతులు తగ్గించుకుంటూ దేశీయంగా బొగ్గు ఉత్పత్తి పెంచే దిశగా మరింత కృషి జరగాలన్నారు. అవసరమైన చోట నిబంధనలు మార్చడానికి సైతం ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. కార్మికులు, గనుల కోసం భూములు వదిలి వెళ్తున్న వారి సంక్షేమం కోసం MDOలు ఆలోచించాలని సూచించారు. ఉద్యోగాల్లో స్థానికులకు ప్రాధాన్యమివ్వాలన్నారు.