News October 21, 2024

ఆ విష‌పూరిత నురుగు అంత‌రిక్షం నుంచీ కనిపిస్తోంది

image

ఢిల్లీకి ప్ర‌ధాన నీటి వ‌న‌రైన‌ య‌మునా న‌ది క‌లుషిత స్థాయుల‌ను చెప్పేందుకు ఈ ఒక్క చిత్రం స‌రిపోతుందేమో. ఏటా న‌వంబ‌ర్‌లో పొరుగు రాష్ట్రాల్లో పంట వ్య‌ర్థాల ద‌హ‌నం స‌హా పండుగ‌ల సీజ‌న్‌లో న‌గ‌రంలో గాలి, నీటి కాలుష్యం భారీగా పెరుగుతుంది. ప‌రిశ్ర‌మల ర‌సాయ‌నాలు, కాలువల వ్య‌ర్థాలతో న‌ది ప్ర‌ధాన బ్యారేజ్‌ల వ‌ద్ద విష‌పూరిత నురుగు ద‌ర్శ‌న‌మిస్తోంది. శాటిలైట్ ఇమేజెస్‌లో కూడా అది కనిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం.

Similar News

News January 1, 2026

తిరుమలకు వెళ్లే దారిలో భారీగా ట్రాఫిక్

image

AP: తిరుపతి నుంచి తిరుమలకు వెళ్లే దారిలో భారీగా ట్రాఫిక్ స్తంభించింది. అలిపిరి టోల్ గేట్ నుంచి తిరుపతి గరుడ జంక్షన్ వరకు వాహనాలు నిలిచిపోయాయి. కాగా లక్కీ డిప్ టోకెన్లు ఉన్నవారికి నేటితో దర్శనాలు ముగియనున్నాయి. రేపటి నుంచి జనవరి 8 వరకు టోకెన్లు లేని భక్తులను కూడా దర్శనానికి అనుమతించనున్నారు.

News January 1, 2026

2026: బీఆర్ఎస్ సెటైరికల్ ట్వీట్

image

TG: 2026లోకి అడుగుపెడుతున్నామని చెబుతూ ఒక్కో అంకెకు ఒక్కో వివరణ ఇస్తూ కాంగ్రెస్ ప్రభుత్వ పాలనపై BRS సెటైరికల్ ట్వీట్ చేసింది. ‘2 – రెండేండ్ల సమయం వృథా, 0 – కాంగ్రెస్ అందించిన సంక్షేమ ఫలాలు గుండు సున్నా, 2 – కాంగ్రెస్ ఇస్తామన్న 2 లక్షల ఉద్యోగాలేవి?, 6- ఇస్తామన్న గ్యారంటీలు ఎక్కడ?’ అంటూ వ్యంగ్యంగా ప్రశ్నించింది. ఎన్నెన్నో హామీలిచ్చి, మాయమాటలతో తెలంగాణ ప్రజలను కాంగ్రెస్ మోసం చేసిందని దుయ్యబట్టింది.

News January 1, 2026

మినుములో మారుకా మచ్చల పురుగు నివారణ(1/2)

image

మినుము పంట పూత దశలో (35 రోజుల) తప్పనిసరిగా పైరుపై లీటరు నీటిలో 5% వేప గింజల కషాయం లేదా వేపనూనె 5ml కలిపి పిచికారీ చేస్తే రెక్కల పురుగులు గుడ్లు పెట్టకుండా నివారించవచ్చు. వీటి పిచికారీతో మొక్కలపై ఉన్న గుడ్లు కూడా పగిలి చనిపోతాయి.
☛ మొగ్గ, పూత దశలో పిల్ల పురుగులు కనిపిస్తే క్లోరిపైరిఫాస్ 2.5ml లేదా థయోడికార్బ్ 1 గ్రా. లేదా ఎసిఫేట్ 1 గ్రామును లీటరు నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి.