News October 22, 2024
ఆస్ట్రేలియా టూర్కు ఇండియా-A టీమ్ ఇదే
ఆస్ట్రేలియాలో పర్యటించే ఇండియా-A జట్టును బీసీసీఐ ప్రకటించింది. రుతురాజ్ కెప్టెన్సీలోని ఈ జట్టు AUS-Aతో రెండు ఫస్ట్ క్లాస్ మ్యాచులు, భారత జట్టుతో ఒక ఇంట్రా స్క్వాడ్ మ్యాచ్ (NOV 15-17) ఆడనుంది.
>> జట్టు: రుతురాజ్ గైక్వాడ్(C), అభిమన్యు ఈశ్వరన్, సుదర్శన్, నితీశ్ కుమార్ రెడ్డి, పడిక్కల్, రికీ భుయ్, బాబా ఇంద్రజిత్, ఇషాన్ కిషన్, పోరెల్, ముకేశ్, ఖలీల్, యశ్ దయాల్, సైనీ, మనవ్, తనుశ్.
Similar News
News October 22, 2024
12 మంది హెడ్ మాస్టర్ల సస్పెండ్
TG: రాష్ట్రంలో 12 మంది హెడ్ మాస్టర్లను పాఠశాల విద్యాశాఖ సస్పెండ్ చేసింది. ట్రాన్స్ఫర్స్లో భర్త లేదా భార్య తన స్పౌజ్ పని చేసే పాఠశాలలకు దగ్గరగా ఆప్షన్ ఎంచుకోవాలనే నిబంధన ఉంది. గతేడాది బదిలీల సందర్భంగా ఈ స్పౌజ్ పాయింట్లను దుర్వినియోగం చేశారనే అభియోగాలపై విచారణ జరిపి చర్యలకు ఉపక్రమించింది. మహబూబ్ నగర్(D)లో 10 మంది, వనపర్తి, జనగామ(D)ల్లో ఒక్కో హెచ్ఎంను సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది.
News October 22, 2024
టెట్ పరీక్షకు 86 శాతం మంది హాజరు
AP: రాష్ట్రంలో 17 రోజులుగా కొనసాగిన ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్) సోమవారంతో ముగిసింది. మొత్తం 4,27,300 మంది దరఖాస్తు చేసుకోగా 3,68,661(86.38శాతం) మంది పరీక్షలు రాశారు. పేపర్-2ఏ సాంఘిక శాస్త్రం, పేపర్-2బీ ప్రత్యేక ఉపాధ్యాయ అర్హత పరీక్షల రెస్పాన్స్ షీట్లు, ప్రాథమిక ‘కీ’ ఈ నెల 23 నుంచి వెబ్సైట్లో అందుబాటులో ఉంచుతారు. ఈ నెల 25 వరకు అభ్యంతరాలు స్వీకరిస్తారు.
News October 22, 2024
టీడీఆర్ బాండ్ల ఆన్లైన్ పోర్టల్ పున:ప్రారంభం
AP: టీడీఆర్ బాండ్ల వినియోగానికి ఆన్లైన్ పోర్టల్ను ప్రభుత్వం పున:ప్రారంభించింది. ఇకపై ఆన్లైన్ దరఖాస్తులను అధికారులు పరిశీలనకు తీసుకోనున్నారు. అపార్ట్మెంట్లలో అదనపు ఫ్లోర్లు వేసుకోవడానికి ఉద్దేశించిన ఈ బాండ్లలో అక్రమాలు జరిగాయనే ఆరోపణలతో ప్రభుత్వం వీటిని నిలిపివేసింది. సర్వే నంబర్లలో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలోని మార్కెట్ విలువ ఆధారంగా కొత్త TDR బాండ్లు ఇవ్వాలని ప్రభుత్వం ఇటీవల నిర్ణయించింది.