News October 22, 2024

ఆటో, ప్రైవేట్ బస్సు ఢీ.. నలుగురు మృతి

image

AP: అన్నమయ్య జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కలకడ మండలం గుట్టపల్లి వద్ద కడప-చిత్తూరు హైవేపై ఆటోను ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలోని నలుగురు అక్కడికక్కడే మరణించారు. సీఎంఆర్ ట్రావెల్స్ బస్సు చిత్తూరు నుంచి హైదరాబాద్ వెళ్తుండగా ఈ యాక్సిడెంట్ జరిగింది.

Similar News

News October 22, 2024

AI ఎఫెక్ట్‌.. ఫోన్ పే కస్టమర్ సపోర్ట్ ఉద్యోగాల్లో కోత

image

ఫోన్ పే కస్టమర్ సపోర్ట్ స్టాఫ్‌పై AI తీవ్ర ప్రభావం చూపింది. గత ఐదేళ్లలో 1,100 మంది(60 శాతం)ని ఫోన్ పే తొలగించింది. ఏఐ ఆధారిత చాట్ బోట్ల ద్వారా ఆటోమేటెడ్ కస్టమర్ సర్వీసులతో సమర్థత పెరిగిందని ఫోన్ పే తన నివేదికలో పేర్కొంది. మరోవైపు కంపెనీ ఆదాయం పెంచుకుని నష్టాలనూ తగ్గించుకుంటోంది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో రూ.3,085 కోట్లుగా ఉన్న ఆదాయం 2023-24లో రూ.5725 కోట్లకు చేరుకుంది.

News October 22, 2024

ఉచిత గ్యాస్ సిలిండర్‌పై UPDATE

image

AP: దీపావళి నుంచి ఉచిత గ్యాస్ <<14417031>>సిలిండర్ల <<>>పథకాన్ని ప్రభుత్వం ప్రారంభించనుంది. ప్రతి 4 నెలల్లో లబ్ధిదారులు ఒక సిలిండర్(ఏడాదికి 3) ఉచితంగా పొందవచ్చు. ప్రస్తుతం సిలిండర్ ధర ₹876గా ఉండగా, ఇందులో రాయితీ ₹25 జమ అవుతోంది. మిగతా ₹851ను సిలిండర్ బుక్ చేసుకున్న లబ్ధిదారుల ఖాతాల్లో ప్రభుత్వం జమ చేయనుంది. ఈ నెల 24 నుంచే ఉచిత గ్యాస్ బుకింగ్‌కు శ్రీకారం చుట్టేలా, దీపావళి నుంచి సరఫరాచేసేలా సమాలోచనలు చేస్తోంది.

News October 22, 2024

కరీంనగర్‌లో ESI ఆస్పత్రికి విజ్ఞప్తి

image

TG: కరీంనగర్‌లో ESI ఆస్పత్రి నిర్మించాలని కేంద్రమంత్రి మన్‌సుఖ్ మాండవీయను కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కోరారు. జిల్లా మెడికల్ హబ్‌గా మారిందని, ఉత్తర తెలంగాణ జిల్లాల నుంచి అత్యధిక మంది ప్రజలు వైద్యం కోసం కరీంనగర్‌కు వస్తున్నారని తెలియజేశారు. బీడీ, నేత కార్మికులు సహా వివిధ రంగాల్లో పనిచేస్తున్న వారి సంఖ్య అధికంగా ఉందంటూ ESI ఆస్పత్రి ఏర్పాటు ఆవశ్యకతను సంజయ్ వివరించారు.