News October 22, 2024
బీటెక్ సీట్ల పెంపుపై సుప్రీంకోర్టుకు వెళ్లనున్న ప్రభుత్వం

TG: నాలుగు ఇంజనీరింగ్ కళాశాలల్లో సీట్ల పెంపునకు అనుమతిస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించనుంది. డిమాండ్ ఉన్న కోర్సుల్లో అదనపు సీట్లు కావాలని ఆయా కాలేజీలు JNTUని కోరాయి. అందుకు జేఎన్టీయూ అంగీకరించకపోవడంతో కాలేజీలు హైకోర్టును ఆశ్రయించాయి. విచారణ జరిపిన హైకోర్టు నాలుగు కళాశాలలకు అనుకూలంగా తీర్పునిచ్చింది. దీంతో హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో ప్రభుత్వం సవాల్ చేయనుంది.
Similar News
News November 7, 2025
సచివాలయాల పేరును మార్చలేదు: CMO

AP: గ్రామ, వార్డు సచివాలయాల పేరును ‘విజన్ యూనిట్లు’గా మార్చారని వస్తున్న వార్తలు అవాస్తవమని సీఎంవో వివరణ ఇచ్చింది. 2047 స్వర్ణాంధ్ర విజన్ సాధన కోసం విజన్ యూనిట్లుగా గ్రామ, వార్డు సచివాలయాలు పని చేయాలని సీఎం దిశానిర్దేశం చేశారని పేర్కొంది. అంతే తప్ప వాటి పేరును విజన్ యూనిట్లుగా మార్చలేదని తెలిపింది.
News November 7, 2025
ఐఐటీ బాంబేలో 53 పోస్టులు.. అప్లైకి ఇవాళే లాస్ట్ డేట్

ఐఐటీ బాంబేలో 53 పోస్టులకు అప్లై చేయడానికి ఇవాళే ఆఖరు తేదీ. అసిస్టెంట్ రిజిస్ట్రార్, టెక్నికల్ ఆఫీసర్, అడ్మినిస్ట్రేటివ్ సూపరింటెండెంట్, అసిస్టెంట్ సెక్యూరిటీ ఇన్స్పెక్టర్, Jr మెకానిక్ తదితర పోస్టులు ఉన్నాయి. పోస్టును బట్టి మాస్టర్ డిగ్రీ, బీఈ, బీటెక్, ఇంటర్, డీఈడీ, డిగ్రీ, బీఈడీ, సీటెట్ ఉత్తీర్ణులైనవారు అర్హులు. వెబ్సైట్: https://www.iitb.ac.in/
News November 7, 2025
శ్రీరాముడి విజయం వెనుక సరస్వతీ దేవి

రావణుడితో యుద్ధంలో శ్రీరాముడి విజయానికి సరస్వతీ దేవి పరోక్షంగా కారణమయ్యింది. రావణుడితో పాటు బ్రహ్మ దేవుడు కుంభకర్ణుడికి కూడా వరం ఇచ్చాడు. అయితే ఆ సమయంలో సరస్వతీ దేవి లోక కళ్యాణానికై అతని నాలుకపై చేరి ‘నిద్ర వరం’ అడిగేలా చేసింది. ఈ అతి నిద్ర కారణంగా కుంభకర్ణుడు ఆలస్యంగా రావడంతో రావణ సైన్యం యుద్ధంలో ఓడిపోయింది. ధర్మసంస్థాపన జరిగింది.
☞ ఇలాంటి మరిన్ని ఆసక్తికర ఆధ్యాత్మిక కథనాల కోసం <<-se_10013>>భక్తి కేటగిరీ<<>>.


