News October 22, 2024

12 మంది హెడ్ మాస్టర్ల సస్పెండ్

image

TG: రాష్ట్రంలో 12 మంది హెడ్ మాస్టర్‌లను పాఠశాల విద్యాశాఖ సస్పెండ్ చేసింది. ట్రాన్స్‌ఫర్స్‌లో భర్త లేదా భార్య తన స్పౌజ్ పని చేసే పాఠశాలలకు దగ్గరగా ఆప్షన్ ఎంచుకోవాలనే నిబంధన ఉంది. గతేడాది బదిలీల సందర్భంగా ఈ స్పౌజ్ పాయింట్లను దుర్వినియోగం చేశారనే అభియోగాలపై విచారణ జరిపి చర్యలకు ఉపక్రమించింది. మహబూబ్ నగర్(D)లో 10 మంది, వనపర్తి, జనగామ(D)ల్లో ఒక్కో హెచ్ఎంను సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది.

Similar News

News September 15, 2025

సూపర్-4కు దూసుకెళ్లిన టీమిండియా

image

ఆసియా కప్‌లో టీమిండియా సూపర్-4కు దూసుకెళ్లింది. తాజాగా ఒమన్‌తో జరిగిన మ్యాచ్‌లో UAE ఘన విజయం సాధించడంతో భారత్‌‌కు లైన్ క్లియర్ అయింది. టీమిండియా ఇప్పటికే UAE, పాక్‌పై విజయం సాధించిన విషయం తెలిసిందే. మెరుగైన నెట్ రన్‌రేట్(4.793) కారణంగా మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సూపర్-4కు అర్హత సాధించింది. రెండో బెర్త్ కోసం పాక్, UAE పోటీ పడనున్నాయి.

News September 15, 2025

BREAKING: కాలేజీలతో చర్చలు సఫలం

image

TG: కాలేజీల యాజమాన్యాలతో రాష్ట్ర ప్రభుత్వం జరిపిన చర్చలు సఫలమయ్యాయి. దీంతో రేపటి నుంచి కాలేజీలు యథావిధిగా నడవనున్నాయి. ప్రస్తుతం రూ.600కోట్ల బకాయిలు చెల్లించేందుకు ప్రభుత్వం అంగీకరించింది. దీపావళికి మరో రూ.600కోట్లు రిలీజ్ చేస్తామని హామీ ఇచ్చింది. దీంతో ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలు బంద్‌ను విరమించుకున్నాయి.

News September 15, 2025

ప్రియుడితో కలిసి భర్త చెవులు కోసేసిన భార్య

image

TG: ప్రియుడితో కలిసి ఓ మహిళ భర్త చెవులు కోసేసిన ఘటన మహబూబాబాద్(D)లో జరిగింది. మహబూబాబాద్ మండలం గడ్డిగూడెం తండాకు చెందిన మహిళకు గంగారం(M) మర్రిగూడేనికి చెందిన అనిల్‌తో వివాహేతర సంబంధం ఉంది. ప్రియుడితో కలిసి భర్తను చంపేందుకు ప్లాన్ చేసింది. ఈ క్రమంలో ఇద్దరూ కలిసి అతడి చెవులు కోసేయగా ప్రాణ భయంతో కేకలు వేస్తూ పరుగులు తీశాడు. అనంతరం పారిపోయేందుకు యత్నించిన ప్రియుడిని స్థానికులు పట్టుకొని చితకబాదారు.