News October 22, 2024

రాష్ట్రంలో కొత్త వ్యవసాయ కాలేజీలు

image

TG: ఉమ్మడి నిజామాబాద్, నల్గొండ జిల్లాల్లో కొత్తగా అగ్రికల్చర్ కాలేజీలను ప్రారంభించాలని వ్యవసాయ శాఖ ఆలోచిస్తోంది. ప్రస్తుతం వ్యవసాయ కోర్సులకు ఉన్న డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని కొత్త కాలేజీల ఏర్పాటుకై ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపనుంది. దీంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న స్కిల్ యూనివర్సిటీలోనూ అగ్రికల్చర్ కోర్సులు ప్రవేశపెట్టాలని వ్యవసాయ శాఖ కోరింది.

Similar News

News October 22, 2024

ఆ మూవీలకు కచ్చితంగా నో చెప్తా: జాతీయ ఉత్తమ నటి

image

భారీ బడ్జెట్‌తో తెరకెక్కే మసాలా మూవీలకు కచ్చితంగా నో చెప్తానని జాతీయ ఉత్తమ నటి నిత్యా మేనన్ అన్నారు. అదే చిన్న సినిమా అయినా మంచి పాత్ర అయితేనే చేస్తానని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. తనకు సంతోషాన్ని ఇచ్చే పాత్రలు చేయడం ఇష్టమని తెలిపారు. సినిమాల ఎంపిక విషయంలో జాగ్రత్తగా ఉంటానని తెలిపారు. ధనుశ్ హీరోగా తెరకెక్కిన ‘తిరుచిత్రంబలం’ చిత్రానికి నిత్య ఉత్తమ నటి అవార్డు అందుకున్న సంగతి తెలిసిందే.

News October 22, 2024

సత్యకుమార్ యాదవ్‌పై హత్యాయత్నం.. పోలీసులకు ఫిర్యాదు

image

AP: మంత్రి సత్యకుమార్ యాదవ్‌పై గత వైసీపీ ప్రభుత్వంలో హత్యాయత్నం జరిగిందని బీజేవైఎం నేత సురేశ్ గుంటూరు ఎస్పీకి ఫిర్యాదు చేశారు. 2023లో రైతుల దీక్షకు సంఘీభావం తెలిపి తిరిగి వస్తుండగా ఆయనతో పాటు కార్యకర్తలపై అప్పటి ఎంపీ నందిగం సురేశ్, మరికొందరు దాడికి యత్నించారని ఆరోపించారు. ఆ సమయంలో ఫిర్యాదును తీసుకోలేదని పేర్కొన్నారు. తాజాగా ఫిర్యాదును స్వీకరించిన SP చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

News October 22, 2024

అయ్యప్ప భక్తుల కోసం IRCTC రైలు

image

అయ్యప్ప భక్తుల కోసం IRCTC తొలిసారిగా భారత్ గౌరవ్ రైలును తీసుకొచ్చింది. ఈ రైలులో వెళ్లి శబరిమల, చొట్టనిక్కర భగవతీ దేవి ఆలయాలు చూడవచ్చు. NOV 16న ఉ.8 గంటలకు SCలో బయల్దేరే ఈ రైలుకు NLG, పిడుగురాళ్ల, GNT, తెనాలి, OGL, NLR, గూడూరు, రేణిగుంట, TPTY, చిత్తూరులో రైలు ఎక్కొచ్చు. 5 పగళ్లు, 4 రాత్రులు రోడ్డు రవాణాతో పాటు టీ, టిఫిన్, లంచ్, డిన్నర్ సౌకర్యాలు ఉంటాయి. స్లీపర్ ఛార్జ్ ₹11,475, థర్డ్ AC ₹18,790.