News October 22, 2024
గండేపల్లి: లారీ డ్రైవర్కి 12 ఏళ్ల జైలు శిక్ష

గండేపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో 2015లో ఒక లారీపై 34 మంది ప్రయాణిస్తూ అందులో 16 మంది మరణించడంతో అజాగ్రత్తగా నడపిన లారీ డ్రైవర్కి అప్పటి గండేపల్లి ఎస్సై రజనీ కుమార్ ముద్దాయిలను అరెస్ట్ చేసి ఛార్జ్షీట్ దాఖలు వేసినట్లు ప్రస్తుత సీఐ శ్రీనివాస్ తెలిపారు. అయితే సోమవారం ఆ కేసుపై పెద్దాపురం కోర్టు జడ్జి డ్రైవర్కి 12 ఏళ్లు జైలు శిక్ష, రూ.12 వేలు జరిమానా విధించినట్లు సీఐ వెల్లడించారు.
Similar News
News December 28, 2025
‘అఖండ గోదావరి’.. ‘తూర్పు’ వెలుగులకి రాదారి!

2025లో తూర్పుగోదావరి జిల్లా మౌలిక, పర్యాటక రంగాల్లో నూతన జవజీవాలను సంతరించుకుంది. రాజమండ్రిని ప్రపంచ పర్యాటక చిత్రపటంపై నిలిపే ‘అఖండ గోదావరి’ ప్రాజెక్టుకు రూ.94.44 కోట్లతో అంకురార్పణ జరగడం ఈ ఏడాది అతిపెద్ద ముందడుగు. రూ.350 కోట్లతో ఆధునికీకరించిన రాజమండ్రి విమానాశ్రయం కొత్త టెర్మినల్ అందుబాటులోకి రావడం, గోదావరి వాటర్ గ్రిడ్ పనులకు శ్రీకారం చుట్టడం జిల్లా పారిశ్రామిక ప్రగతికి బలమైన పునాది వేశాయి.
News December 28, 2025
‘అఖండ గోదావరి’.. ‘తూర్పు’ వెలుగులకి రాదారి!

2025లో తూర్పుగోదావరి జిల్లా మౌలిక, పర్యాటక రంగాల్లో నూతన జవజీవాలను సంతరించుకుంది. రాజమండ్రిని ప్రపంచ పర్యాటక చిత్రపటంపై నిలిపే ‘అఖండ గోదావరి’ ప్రాజెక్టుకు రూ.94.44 కోట్లతో అంకురార్పణ జరగడం ఈ ఏడాది అతిపెద్ద ముందడుగు. రూ.350 కోట్లతో ఆధునికీకరించిన రాజమండ్రి విమానాశ్రయం కొత్త టెర్మినల్ అందుబాటులోకి రావడం, గోదావరి వాటర్ గ్రిడ్ పనులకు శ్రీకారం చుట్టడం జిల్లా పారిశ్రామిక ప్రగతికి బలమైన పునాది వేశాయి.
News December 28, 2025
జిల్లాలో ఖాళీల ఖిల్లా.. పండుగ వేళ పోలీసులకు సవాల్!

తూర్పుగోదావరి జిల్లాలో పండుగ వేళ శాంతిభద్రతల పరిరక్షణ సవాల్గా మారింది. కీలకమైన ఏఎస్పీ, డీఎస్పీ పోస్టులు ఖాళీగా ఉండటం విధి నిర్వహణపై ప్రభావం చూపుతోంది. రాజమండ్రిలో ముగ్గురు ఏఎస్పీలకు గాను ఎవరూ అందుబాటులో లేరు. ట్రాఫిక్, మహిళా పీఎస్, సెంట్రల్ డీఎస్పీ పోస్టులు కూడా ఖాళీగానే ఉన్నాయి. నూతన సంవత్సర, సంక్రాంతి వేడుకల వేళ సిబ్బంది కొరత పోలీసు శాఖను వేధిస్తోంది.


