News October 22, 2024

గుంటూరు: డీఎస్సీ ఉచిత శిక్షణకు గడువు పెంపు

image

డీఎస్సీ-2024కి హాజరయ్యే షెడ్యూల్డ్ కులాలు, తెగల అభ్యర్థులు ఉచిత శిక్షణ కోసం దరఖాస్తు చేసుకునే గడువును ప్రభుత్వం ఈ నెల 25 వరకు పొడిగించినట్లు జిల్లా సాంఘిక సంక్షేమశాఖ ఉప సంచాలకుడు మధుసూదనరావు తెలిపారు. అభ్యర్థులను స్థానిక సచివాలయంలో 6 ప్రామాణిక అంశాలను పరిగణనలోకి తీసుకుని దరఖాస్తుకు ఎంపిక చేస్తారన్నారు. jnanbhumi.ap.gov.inలో దరఖాస్తు చేసుకోవాలని కోరారు. నవంబరు 3న ఆన్‌లైన్లో ప్రాథమిక పరీక్ష ఉంటుంది.

Similar News

News March 2, 2026

దుగ్గిరాలలో రోడ్డు ప్రమాదం.. చెట్టు ఎక్కిన బైక్!

image

బైక్ అదుపు తప్పి ఇద్దరు యువకులు గాయపడగా, వారి వాహనం వింతగా చెట్టుపైకి దూసుకెళ్లిన ఘటన దుగ్గిరాల లాకు వద్ద జరిగింది. చినరావూరుకు చెందిన కిషోర్, విజయ్ ప్రయాణిస్తున్న బైక్ ప్రమాదవశాత్తూ పడిపోగా, బైక్ మాత్రం చెట్టు కొమ్మల్లో ఇరుక్కుపోయింది. గాయపడిన యువకులను చికిత్స నిమిత్తం తెనాలి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

News March 2, 2026

తుళ్లూరులో కొడుకుని పట్టించిన పేరెంట్స్..!

image

తుళ్లూరు మండల పరిధిలోని గ్రామాల్లో ఆవులను దొంగతనం చేస్తున్న వ్యక్తిని పోలీసుల అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు శ్రీకాంత్ మండల వ్యాప్తంగా సుమారు 25 ఆవులకు పైగా అపహరించినట్లు పలువురు యజమానులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అతణ్ని పోలీసులు అదుపులోకి తీసుకోగా, స్టేషన్ వెనకవైపు ఉన్న గోడ దూకి పారిపోయాడు. తిరిగి కుటుంబ సభ్యులు పోలీసులకు అప్పజెప్పగా సిబ్బంది పేరెంట్స్‌ను అభినందించారు.

News March 2, 2026

గుంటూరులో ప్రారంభమైన రెవెన్యూ క్లినిక్

image

గుంటూరు కలెక్టరేట్ శంకర్ సమావేశ మందిరంలో రెవెన్యూ క్లినిక్ సోమవారం ప్రారంభమైంది. జేసీ శ్రీవాత్సవ, ఆర్డీఓ శ్రీనివాసరావు డిప్యూటీ కలెక్టర్ లక్ష్మీ కుమారి అర్జీదారుల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. భూ సమస్యలు, వివాదాలకు సంబంధించిన అర్జీలు అందాయి. రెవెన్యూ క్లినిక్ వచ్చే సమస్యలను వేగవంతంగా పరిష్కరించాలని జేసీ అధికారులను ఆదేశించారు.