News October 22, 2024
వినేశ్, బజరంగ్ స్వార్థంతో ఉద్యమానికి చెడ్డ పేరు: సాక్షి మాలిక్
రెజ్లింగ్ సంఘం అధ్యక్షుడిగా బ్రిజ్భూషణ్ను తొలగించాలంటూ చేసిన ఉద్యమంలో తన సహచర రెజర్లు వినేశ్ ఫొగట్, బజరంగ్ పునియాపై రెజ్లర్ సాక్షి మాలిక్ తీవ్ర ఆరోపణలు చేశారు. ‘ఆసియా క్రీడల సెలక్షన్స్ నుంచి మినహాయింపు కోరడం వినేశ్, బజరంగ్ చేసిన పెద్ద తప్పు. అది మా నిరసనకు చెడ్డ పేరు తెచ్చింది. కొందరు వారిద్దరిలో స్వార్థం నింపి సొంత ప్రయోజనాల కోసం ఆలోచించేలా చేయగలిగారు’ అని తన పుస్తకం విట్నెస్లో వెల్లడించారు.
Similar News
News October 22, 2024
డ్రోన్స్.. ఫ్యూచర్ గేమ్ ఛేంజర్స్: CBN
AP: రాబోయే రోజుల్లో డ్రోన్స్ గేమ్ ఛేంజర్స్ కానున్నాయని సీఎం చంద్రబాబు అన్నారు. డ్రోన్ సమ్మిట్ 2024లో ఆయన మాట్లాడారు. హైదరాబాద్లో ఐటీ అభివృద్ధికి కృషి చేసినట్లు తెలిపారు. ఇప్పుడు అది దేశంలోనే గొప్ప నగరంగా ఉందన్నారు. 1995లోనే ఐటీ గురించి ఆలోచించి, అనేక కంపెనీలను తీసుకొచ్చినట్లు తెలిపారు. భవిష్యత్తులో డేటానే కీలకమని, ఎన్ని డబ్బులు ఉన్నాయనేది కాదని, ఎంత డేటా ఉందనేది గొప్పగా చూస్తారని చెప్పారు.
News October 22, 2024
ఆధార్ ఉన్న వారికి శుభవార్త
APలో ఇవాళ్టి నుంచి ప్రభుత్వం ఆధార్ ప్రత్యేక క్యాంపులు నిర్వహించనుంది. గ్రామ, వార్డు సచివాలయాలు, కాలేజీలు, స్కూళ్లు, అంగన్వాడీ సెంటర్లలో 4 రోజుల పాటు ఈ క్యాంపులు నిర్వహించనుంది. ఇందుకోసం ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లు తగిన చర్యలు తీసుకోవాలంది. ఈ క్యాంపుల్లో కొత్త ఆధార్ నమోదు, బయోమెట్రిక్ అప్డేట్, డెమోగ్రాఫిక్ అప్డేట్, ఈ-ఆధార్ వంటి సేవలు అందించనున్నారు.
News October 22, 2024
వచ్చే 20 ఏళ్లలో 200కు పైగా ఎయిర్పోర్టులు: రామ్మోహన్ నాయుడు
AP: వచ్చే 20 ఏళ్లలో దేశంలో 200కు పైగా ఎయిర్ పోర్టులు వస్తాయని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. మంగళగిరిలో నిర్వహించిన డ్రోన్ సమ్మిట్-2024లో ఆయన మాట్లాడారు. గత పదేళ్లలో ఎయిర్ పోర్టుల సంఖ్య 74 నుంచి 157కి పెరిగిందని పేర్కొన్నారు. చంద్రబాబు ఐడియాలజీని అందుకోవడం తనకు కూడా కష్టంగా ఉందని చెప్పారు. విజన్ 2020తో పెను మార్పులు తీసుకొచ్చారని పేర్కొన్నారు. HYDను ప్రపంచ స్థాయి నగరంగా మార్చారన్నారు.