News October 22, 2024
బుక్ ఫెయిర్కు వచ్చి బిర్యానీలు లాగించారు!
పాకిస్థాన్లోని లాహోర్లో నిర్వహించిన బుక్ ఫెయిర్ కాస్తా ఫుడ్ ఫెస్ట్గా మారింది. సాహిత్యం- సంస్కృతిని ప్రోత్సహించేందుకు, బుక్స్ చదివే అలవాట్లను పెంపొందించేందుకు నిర్వాహకులు పుస్తక ప్రదర్శన ఏర్పాటు చేశారు. దీనికి వేలాది మంది తరలిరాగా కేవలం 35 పుస్తకాలే అమ్ముడయ్యాయి. కానీ, 1200 షావర్మాలు, 800 బిర్యానీలు అమ్ముడయ్యాయి. దీంతో పుస్తకాల కంటే తిండే ముఖ్యమైందని నెట్టింట విమర్శలొస్తున్నాయి.
Similar News
News October 22, 2024
15 రోజుల్లో డ్రోన్ పాలసీ: CBN
AP: విజయవాడ వరద సాయంలో డ్రోన్లు కీలకంగా వ్యవహరించాయని సీఎం చంద్రబాబు అన్నారు. రానున్న రోజుల్లో అమరావతి డ్రోన్ సిటీగా మారనుందని చెప్పారు. డ్రోన్ల ఆవిష్కరణలో దేశానికి ఏపీ కేంద్రం కానుందని పేర్కొన్నారు. దీని కోసం 15 రోజుల్లో డ్రోన్ పాలసీని తీసుకొస్తామన్నారు. డ్రోన్ హబ్ ఏర్పాటుకు ఓర్వకల్లులో 300 ఎకరాల భూమిని ఇస్తామన్నారు. ప్రభుత్వం తరఫున అన్ని విధాలుగా సహకారం ఉంటుందన్నారు.
News October 22, 2024
మత మార్పిడి వివాదంలో చిక్కుకున్న టీమ్ఇండియా క్రికెటర్!
క్రికెటర్ జెమీమా రోడ్రిగ్స్ సభ్యత్వాన్ని ముంబై జింఖానా క్లబ్ రద్దు చేసింది. ఆమె తండ్రి ఇవాన్ క్లబ్ ప్రెసిడెన్షియల్ హాల్లో మత మార్పిళ్లను ప్రోత్సహిస్తుండటమే ఇందుకు కారణం. ‘Brother Manuel Ministries’ తరఫున ఆయన 35 ఈవెంట్లు నిర్వహించారని క్లబ్ మెంబర్ శివ మల్హోత్ర అన్నారు. ‘దేశవ్యాప్తంగా కన్వర్షన్స్ గురించి మనకు తెలిసిందే. ఇప్పుడిది మా వద్దే జరిగింది. క్లబ్లో ఇలాంటివి నిషేధం’ అని తెలిపారు.
News October 22, 2024
డ్రోన్స్.. ఫ్యూచర్ గేమ్ ఛేంజర్స్: CBN
AP: రాబోయే రోజుల్లో డ్రోన్స్ గేమ్ ఛేంజర్స్ కానున్నాయని సీఎం చంద్రబాబు అన్నారు. డ్రోన్ సమ్మిట్ 2024లో ఆయన మాట్లాడారు. హైదరాబాద్లో ఐటీ అభివృద్ధికి కృషి చేసినట్లు తెలిపారు. ఇప్పుడు అది దేశంలోనే గొప్ప నగరంగా ఉందన్నారు. 1995లోనే ఐటీ గురించి ఆలోచించి, అనేక కంపెనీలను తీసుకొచ్చినట్లు తెలిపారు. భవిష్యత్తులో డేటానే కీలకమని, ఎన్ని డబ్బులు ఉన్నాయనేది కాదని, ఎంత డేటా ఉందనేది గొప్పగా చూస్తారని చెప్పారు.