News October 22, 2024
15 రోజుల్లో డ్రోన్ పాలసీ: CBN
AP: విజయవాడ వరద సాయంలో డ్రోన్లు కీలకంగా వ్యవహరించాయని సీఎం చంద్రబాబు అన్నారు. రానున్న రోజుల్లో అమరావతి డ్రోన్ సిటీగా మారనుందని చెప్పారు. డ్రోన్ల ఆవిష్కరణలో దేశానికి ఏపీ కేంద్రం కానుందని పేర్కొన్నారు. దీని కోసం 15 రోజుల్లో డ్రోన్ పాలసీని తీసుకొస్తామన్నారు. డ్రోన్ హబ్ ఏర్పాటుకు ఓర్వకల్లులో 300 ఎకరాల భూమిని ఇస్తామన్నారు. ప్రభుత్వం తరఫున అన్ని విధాలుగా సహకారం ఉంటుందన్నారు.
Similar News
News October 22, 2024
ఈ నంబర్ల నుంచి వచ్చే మెసేజ్లకు స్పందించవద్దు: TDP
AP: మంత్రి నారా లోకేశ్ టీమ్ అంటూ సాయం పేరుతో ఫేక్ ఎన్నారై టీడీపీ పేర్లతో మోసగాళ్లు స్కాంలు చేస్తున్నారని టీడీపీ తెలిపింది. +1(208)6482504, 8977038602 నంబర్ల నుంచి వచ్చే మెసేజ్లకు స్పందించవద్దని ప్రజలకు సూచించింది. ఎవరైనా డబ్బులు అడిగితే వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలంది. ఇప్పటికే ఫేక్ నంబర్లతో మోసగిస్తున్న వారిపై సైబర్ క్రైమ్ విభాగం దర్యాప్తు చేస్తోందని ట్వీట్ చేసింది.
News October 22, 2024
నాయకత్వానికి వయసుతో సంబంధం లేదు: Zepto CEO
కంపెనీని విజయవంతంగా నడిపించేందుకు వయసుతో సంబంధం లేదని Zepto CEO ఆదిత్ పాలిచా పేర్కొన్నారు. NDTV వరల్డ్ సమ్మిట్లో ఆయన ఇంట్రెస్టింగ్ వ్యాఖ్యలు చేశారు. కంపెనీలో తన కంటే అధిక వయస్కులను ఇంటర్స్న్గా తీసుకున్నానని చెప్పారు. ‘నా ఏజ్ కంటే రెండు రెట్లు ఎక్కువ గల ఉద్యోగులు సైతం నాకు రిపోర్ట్ చేస్తుంటారు. నాయకత్వానికి వయసుతో పట్టింపు లేదు’ అని చెప్పుకొచ్చారు.
News October 22, 2024
ఐదేళ్ల పాటు నకిలీ కోర్టు నడిపేశారు!
గుజరాత్లో కొంతమంది దుండగులు ఏకంగా నకిలీ కోర్టునే సృష్టించారు. పోలీసుల వివరాల ప్రకారం.. మోరిస్ సామ్యుల్ క్రిస్టియన్ అనే నిందితుడు తన ముఠాతో కలిసి 2019లో ఓ ప్రభుత్వ భూమి సెటిల్మెంట్లో నకిలీ తీర్పు ఇచ్చేందుకు నకిలీ కోర్టును ఏర్పాటు చేశాడు. అప్పటి నుంచీ అతడి ముఠా ఈ దందాను కొనసాగిస్తుంది. అహ్మదాబాద్లోని సిటీ సివిల్ కోర్టు రిజిస్ట్రార్ ఫిర్యాదు చేయడంతో ఎట్టకేలకు మోరిస్ బండారం బట్టబయలైంది.