News October 22, 2024
వాట్సాప్తో ప్రభుత్వం ఒప్పందం
AP: కాస్ట్ సహా ఇతర సర్టిఫికెట్లు, పౌరసేవలు వాట్సాప్లో పొందేలా మెటా సంస్థతో రాష్ట్ర ప్రభుత్వం MOU చేసుకుంది. కరెంట్, వాటర్, ఇంటి పన్ను, ఇతర బిల్లులు ఇకపై వాట్సాప్లోనే చెల్లించవచ్చు. నకిలీలు, ట్యాంపరింగ్ అవకాశం లేకుండా పారదర్శకంగా ఆన్లైన్లోనే సర్టిఫికెట్లు ఇవ్వనుంది. మెటా నుంచి టెక్నికల్ సపోర్ట్, ఈ గవర్నెన్స్, AI ద్వారా మరిన్ని సిటిజెన్ సర్వీసెస్ ఏపీ ప్రభుత్వానికి అందించనుంది.
Similar News
News October 22, 2024
ఫ్రీ మీల్స్తో క్రియేటివిటీ, కోఆపరేషన్: సుందర్ పిచ్చాయ్
ఆఫీసులో ఫ్రీ మీల్స్ ఏర్పాటుతో ఉద్యోగుల్లో సృజనాత్మకత, సహకార ధోరణి పెరుగుతాయని ఆల్ఫాబెట్ CEO సుందర్ పిచ్చాయ్ అన్నారు. ఉద్యోగంలో చేరిన తొలి నాళ్లలో కేఫేలో ఇతరులతో చర్చల వల్ల పనిపట్ల ఉత్సుకత పెరిగి క్రియేటివిటీ పనితీరుకు దోహదం చేసేదని పేర్కొన్నారు. గూగుల్ కొత్త ఐడియాస్ సంస్థలోని కేఫే చర్చల్లో పుట్టుకొచ్చినవే అని వివరించారు. ఫ్రీ మీల్స్తో ఖర్చుల కంటే ప్రయోజనాలు ఎక్కువన్నారు.
News October 22, 2024
84 ఎకరాల భూకబ్జాకు యత్నం.. టాలీవుడ్ నిర్మాత అరెస్ట్
టాలీవుడ్ నిర్మాత బూరుగుపల్లి శివరామకృష్ణను HYD పోలీసులు అరెస్టు చేశారు. నకిలీపత్రాలతో రాయదుర్గంలో రూ.వేల కోట్ల విలువైన 84 ఎకరాల ప్రభుత్వ భూమిని కాజేసేందుకు ఆయన ప్రయత్నించినట్లు తేలింది. 20 ఏళ్లపాటు హైకోర్టు, సుప్రీంకోర్టులో వాదనలు కొనసాగాయి. ఆయన సమర్పించిన పత్రాలు నకిలీవని సుప్రీం తేల్చడంతో పోలీసులు కేసు పెట్టారు. ఈయన సీతారత్నంగారి అబ్బాయి, ప్రేమంటే ఇదేరా, యువరాజు, దరువు చిత్రాలను నిర్మించారు.
News October 22, 2024
తుఫాన్ ప్రభావం.. పలు రైళ్లు రద్దు
AP: తుఫాన్ దృష్ట్యా ఈస్ట్ కోస్ట్ పరిధిలో ఈ నెల 23, 24, 25 తేదీల్లో పలు రైళ్లను రద్దు చేసినట్లు రైల్వే శాఖ తెలిపింది. 23న 18, 24న 37, 25న 11 రైళ్లను క్యాన్సిల్ చేసినట్లు పేర్కొంది. సికింద్రాబాద్-భువనేశ్వర్, కన్యాకుమారి-దిబ్రూగఢ్, చెన్నై సెంట్రల్-షాలిమార్, ముంబై-భువనేశ్వర్ కోణార్క్, హైదరాబాద్-హౌరా ఈస్ట్ కోస్ట్, బెంగళూరు-హౌరా తదితర రైళ్లు రద్దయ్యాయి.