News October 22, 2024
అదనపు కలెక్టర్కు రూ.5కోట్ల అక్రమ ఆస్తులు.. కేసు నమోదు
TG: రంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ వెంకట భూపాల్ రెడ్డిపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదైంది. ఆయన ఇంట్లో ఏసీబీ సోదాలు చేయగా, రూ.5కోట్ల విలువైన అక్రమ ఆస్తులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. గతంలో ఆయన రూ.8లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన సంగతి తెలిసిందే.
Similar News
News October 22, 2024
కొత్త పీఆర్సీ సిఫార్సులు అమలు చేయాలి: ఉద్యోగుల జేఏసీ
TG: కొత్త పీఆర్సీ సిఫార్సులు అమలు చేయాలనే డిమాండ్తో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల జేఏసీ కార్యాచరణను ప్రకటించింది. ఈనెల 28న సీఎం, సీఎస్కు, నవంబర్ 2న కలెక్టర్లు, 4, 5 తేదీల్లో ప్రజాప్రతినిధులకు కార్యాచరణ లేఖలు ఇవ్వనుంది. నవంబర్ 7 నుంచి డిసెంబర్ 27 వరకు ఉమ్మడి జిల్లాల వారీగా సదస్సులు, వచ్చే ఏడాది జనవరి 3, 4 తేదీల్లో నల్ల బ్యాడ్జీలతో నిరసనలు, JAN 23న బైక్ ర్యాలీలు, 30న మానవహారాలు నిర్వహించనుంది.
News October 22, 2024
టెస్టుల్లో మళ్లీ ఆడేందుకు సిద్ధం: డేవిడ్ వార్నర్
టెస్టుల నుంచి రిటైరైన ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ తన సేవలు అవసరమైతే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో రీఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమని ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. సాధన కోసం షెఫీల్డ్ షీల్డ్లో ఆడతానని పేర్కొన్నారు. వార్నర్ రిటైర్మెంట్ తర్వాత టెస్టుల్లో ఆస్ట్రేలియాకు స్మిత్ ఓపెనింగ్ చేస్తుండగా, BGTకి ఆ స్థానం నుంచి తప్పుకొన్నారు. ఓపెనింగ్ స్థానానికి ఖాళీ ఏర్పడిన నేపథ్యంలో వార్నర్ తాజాగా ఈ వ్యాఖ్యలు చేశారు.
News October 22, 2024
ఫ్రీ మీల్స్తో క్రియేటివిటీ, కోఆపరేషన్: సుందర్ పిచ్చాయ్
ఆఫీసులో ఫ్రీ మీల్స్ ఏర్పాటుతో ఉద్యోగుల్లో సృజనాత్మకత, సహకార ధోరణి పెరుగుతాయని ఆల్ఫాబెట్ CEO సుందర్ పిచ్చాయ్ అన్నారు. ఉద్యోగంలో చేరిన తొలి నాళ్లలో కేఫేలో ఇతరులతో చర్చల వల్ల పనిపట్ల ఉత్సుకత పెరిగి క్రియేటివిటీ పనితీరుకు దోహదం చేసేదని పేర్కొన్నారు. గూగుల్ కొత్త ఐడియాస్ సంస్థలోని కేఫే చర్చల్లో పుట్టుకొచ్చినవే అని వివరించారు. ఫ్రీ మీల్స్తో ఖర్చుల కంటే ప్రయోజనాలు ఎక్కువన్నారు.