News October 22, 2024

రైతులకు అవసరమైన ఎరువులు, విత్తనాల సిద్ధం: కలెక్టర్

image

జిల్లాలో వ్యవసాయ సీజన్ ప్రారంభమవుతునందున రైతులకు అవసరమైన ఎరువులు, విత్తనాలు కొరత లేకుండా సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్ అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆయన తన చాంబర్లో వ్యవసాయ అనుబంధ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. జిల్లాలో రైతుల భూములకు సంబంధించి మట్టి నమూనా పరీక్షలు చేపట్టాలన్నారు. రైతులు పండించే పంటలకు సంబంధించి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఇతర కంపెనీలతో అనుసంధానం చేసి చేరువ చేయాలన్నారు.

Similar News

News July 6, 2025

ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకూడదు: కలెక్టర్

image

నెల్లూరు బారాషహిద్ దర్గాలో రొట్టెల పండుగ వైభవంగా కొనసాగుతోంది. ఈ క్రమంలో ఆదివారం సాయంత్రం పండుగ ఏర్పాట్లు, భద్రత, వసతులను కలెక్టర్ ఆనంద్, ఎస్పీ కృష్ణకాంత్ పరిశీలించారు. భక్తులకు ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని కలెక్టర్ అధికారుల్ని ఆదేశించారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు నిరంతరం పర్యవేక్షించాలని ఎస్పీ సూచించారు.

News July 6, 2025

నెల్లూరులో రొట్టెల పండుగ.. తొలిరోజే జనం కిటకిట

image

నెల్లూరు నగరంలోని స్వర్ణాల చెరువు దగ్గర బారాషహీద్ దర్గాలో సోమవారం రొట్టెల పండుగ ఘనంగా ప్రారంభమైంది. ఇవాళ తెల్లవారుజాము నుంచి భక్తులు పలు రాష్ట్రాల నుంచి రొట్టెల పండుగ ప్రాంగణానికి విచ్చేశారు. స్వర్ణాల చెరువులో కోర్కెలు తీర్చే విధంగా భక్తులు రొట్టెలు పంచుకుంటున్నారు. ప్రారంభమైన తొలిరోజే భక్తుల తాకిడి ఎక్కువైంది. క్యూలైన్ల అన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి.

News July 6, 2025

రేపటి నుంచి పెరగనున్న భక్తుల రద్దీ

image

నెల్లూరులోని బారాషహిద్ దర్గా వద్ద నేటి నుంచి రొట్టెల పండగ ప్రారంభం కానుంది. అన్ని గ్రామాల్లో జరుగుతున్న మొహర్రం వేడుకలు ఆదివారంతో ముగుస్తాయి. దీంతో నేడు బారాషహిద్ దర్గా వద్ద భక్తుల రద్దీ తక్కువగా ఉండే అవకాశం ఉంది. సోమవారం నుంచి భక్తుల రద్దీ పెరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు అంచనాలు వేస్తున్నారు. ఇప్పటికే దర్గా వద్ద పోలీస్ అధికారులు 1700 మందితో బందోబస్తు ఏర్పాటు చేశారు.