News October 22, 2024

టీమ్‌ఇండియాలో తీవ్ర పోటీ.. అసిస్టెంట్ కోచ్ ఏమన్నారంటే?

image

భారత టెస్టు జట్టులో మిడిలార్డర్ కోసం పోటీ ఎక్కువగా ఉందని అసిస్టెంట్ కోచ్ డస్కాటే అన్నారు. ఆరు స్థానాలకు ఏడుగురు పోటీ పడుతున్నారని, పిచ్‌ను బట్టి జట్టును సెలక్ట్ చేస్తామని చెప్పారు. ‘గిల్ ఫిట్‌గా ఉన్నారు. పంత్ గాయం నుంచి కోలుకున్నారు. సర్ఫరాజ్ తొలి టెస్టులో భారీ స్కోర్ చేశారు. KL రాహుల్ మానసికంగా బలంగా ఉన్నారు. ప్లేయర్లందరికీ మా మద్దతు ఉంటుంది. జట్టు ప్రయోజనాలే మాకు ముఖ్యం’ అని మీడియాకు తెలిపారు.

Similar News

News March 17, 2025

RECORD: FY25లో ₹1.75 లక్షల కోట్ల ఫోన్లు ఎగుమతి

image

భారత్ సరికొత్త రికార్డు సృష్టించింది. FY25 తొలి 11 నెలల్లోనే రూ.1.75లక్షల కోట్ల ($21B) విలువైన మొబైల్ ఫోన్లను ఎగుమతి చేసింది. IT మినిస్టర్ అశ్వినీ వైష్ణవ్ అంచనా వేసిన $20Bతో పోలిస్తే ఇది ఎక్కువే. FY24లో ఎగుమతి చేసిన $15.6Bతో చూస్తే ఏకంగా 54% ఎక్కువ. భారత్ నుంచి అమెరికా, బ్రిటన్, UAE, నెదర్లాండ్స్‌కు యాపిల్, శామ్‌సంగ్ మొబైళ్లు ఎగుమతి అవుతున్నాయి. అందులో USకే 50% కన్నా ఎక్కువ వెళ్తున్నాయి.

News March 17, 2025

ఊహించని కలెక్షన్లు.. 3 రోజుల్లోనే రూ.24 కోట్లు

image

హీరో నాని నిర్మాతగా తెరకెక్కించిన ‘కోర్టు’ మూవీ కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. విడుదలైన మూడు రోజుల్లోనే ఈ చిత్రం రూ.24.4 కోట్లు వసూలు చేసినట్లు మూవీ యూనిట్ ట్వీట్ చేసింది. ప్రేక్షకులు బ్లాక్‌బస్టర్ తీర్పు ఇచ్చారని పేర్కొంది. రామ్ జగదీశ్ తెరకెక్కించిన ఈ సినిమాలో ప్రియదర్శి, రోషన్, శ్రీదేవి, శివాజీ కీలక పాత్రలు పోషించారు. మరోవైపు ఈ మూవీ యూఎస్ఏలో 600K డాలర్లు రాబట్టిందని సినీ వర్గాలు తెలిపాయి.

News March 17, 2025

అన్ని జిల్లాల పర్యటనకు కేటీఆర్

image

TG: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించనున్నారు. ఈ నెల 20న సూర్యాపేట, 23న కరీంనగర్‌లో పర్యటిస్తారు. బీఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ సంబరాల విజయానికి దిశానిర్దేశం చేయనున్నారు. ఈ క్రమంలో ముఖ్య కార్యకర్తలతో సమావేశం కానున్నారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల అనంతరం కేటీఆర్ రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో పర్యటించనున్నారు.

error: Content is protected !!