News October 22, 2024
కొత్త పీఆర్సీ సిఫార్సులు అమలు చేయాలి: ఉద్యోగుల జేఏసీ
TG: కొత్త పీఆర్సీ సిఫార్సులు అమలు చేయాలనే డిమాండ్తో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల జేఏసీ కార్యాచరణను ప్రకటించింది. ఈనెల 28న సీఎం, సీఎస్కు, నవంబర్ 2న కలెక్టర్లు, 4, 5 తేదీల్లో ప్రజాప్రతినిధులకు కార్యాచరణ లేఖలు ఇవ్వనుంది. నవంబర్ 7 నుంచి డిసెంబర్ 27 వరకు ఉమ్మడి జిల్లాల వారీగా సదస్సులు, వచ్చే ఏడాది జనవరి 3, 4 తేదీల్లో నల్ల బ్యాడ్జీలతో నిరసనలు, JAN 23న బైక్ ర్యాలీలు, 30న మానవహారాలు నిర్వహించనుంది.
Similar News
News October 23, 2024
DANGER: ఆల్కహాల్ తాగుతున్నారా?
మద్యం సేవించే అలవాటు వల్ల 40 ఏళ్ల వ్యక్తి వెంటిలేటర్పై చావుబతుకుల్లో ఉన్నాడు. మద్యం తాగితే కాలేయం పాడవుతుందని పొరబడుతుంటారు. కానీ, ఆల్కహాల్ అనేది విషంతో సమానమని, ఇది శరీరంలోని అన్ని భాగాలను దెబ్బతీస్తుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఈ వ్యక్తి మెదడులో రక్తస్రావం జరిగి, పుర్రె లోపలి మెదడు కణజాలం పూర్తిగా దెబ్బతిందన్నారు. అతణ్ని బతికించడం కష్టమని తేల్చేశారు. మద్యం తాగకపోవడం మంచిదని సూచించారు.
News October 23, 2024
దసరాకి రూ.307.16 కోట్ల ఆదాయం: TGSRTC
TG: బతుకమ్మ, దసరా పండుగల సందర్భంగా సాధారణ బస్సులతో పాటు 10,513 అదనపు బస్సులను నడిపినట్లు TGSRTC అధికారులు తెలిపారు. అక్టోబర్ 1 నుంచి 15వ తేదీ వరకూ మొత్తం 707.73 లక్షల మంది ప్రయాణికులు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించారని, రూ.307.16 కోట్ల మేర ఆదాయం వచ్చిందని వెల్లడించారు.
News October 23, 2024
సిగ్నల్స్ వద్ద ఉండే పిల్లలు నిద్రపోయే కనిపిస్తున్నారా?
హైదరాబాద్లోని ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద భిక్షాటన చేసుకునే కొందరు వారి పిల్లలను నిద్రపుచ్చేందుకు డ్రగ్స్ వాడుతున్నారని సామాజిక వేత్తలు స్వాతి& విజయ్లు ఆరోపించారు. ఎందుకు నిద్రపోతున్నారో తెలియకుండానే బాల్యం పూర్తవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి వాటిపై నోరు విప్పాలని, అంతా కలిసి అలాంటి పిల్లలను కాపాడేందుకు ముందుకు సాగుదామని వీరు క్యాంపెయిన్ రన్ చేస్తున్నారు. దీనిపై కరపత్రాలనూ పంచుతున్నారు.