News October 22, 2024
2 రోజుల్లోనే అకౌంట్లలోకి డబ్బులు: మంత్రి నాదెండ్ల

AP: ధాన్యాన్ని కొనుగోలు చేసిన 48 గంటల్లోపే రైతుల అకౌంట్లలో డబ్బులు జమ చేస్తామని మంత్రి నాదెండ్ల మనోహర్ పునరుద్ఘాటించారు. మొదటి రకం వడ్లను మద్దతు ధర రూ.2,350తో కొంటామన్నారు. రైతులు వారికి నచ్చిన రైస్ మిల్లులో ధాన్యాన్ని అమ్ముకోవచ్చని తెలిపారు. గోనెసంచులు, హమాలీ, రవాణా ఛార్జీలను ప్రభుత్వమే భరిస్తుందని వెల్లడించారు. వైసీపీ ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని నిర్లక్ష్యం చేసిందని విమర్శించారు.
Similar News
News January 14, 2026
పొంగల్.. టార్గెట్ ఎలక్షన్స్!

PM మోదీ ఈసారి తమిళనాడుకు చెందిన కేంద్రమంత్రి మురుగన్ ఇంట పొంగల్ సెలబ్రేషన్స్లో పాల్గొనడం రాజకీయ చర్చకు దారితీసింది. తన స్పీచ్లోనూ తమిళ పదాలు మాట్లాడుతూ ఆ రాష్ట్ర ప్రజలను ఆకట్టుకున్నారు. ఈ ఏడాది TN అసెంబ్లీ ఎన్నికలే టార్గెట్గా బీజేపీ సన్నద్ధమవుతోంది. అధికారం చేజిక్కించుకుంటామని ఇప్పటికే కమలనాథులు ధీమా వ్యక్తం చేశారు. ఇందులో భాగంగా ఈ నెలాఖరులో మోదీ తమిళనాడులో పర్యటించే అవకాశం ఉంది.
News January 14, 2026
విజయ్ ఫ్యాన్స్పై డైరెక్టర్ సుధా కొంగర ఫైర్!

ఓ వర్గం ఫ్యాన్స్ కావాలనే తమ సినిమాపై విమర్శలు చేస్తున్నారని పరాశక్తి టీమ్ ఆరోపిస్తోంది. ఫేక్ IDల ద్వారా కొంత మంది బురద జల్లుతున్నారని తాజాగా డైరెక్టర్ సుధా కొంగర అన్నారు. తమపై విమర్శలు చేస్తున్నది రాజకీయ వర్గాలు కాదన్నారు. పండుగకు విడుదలకు నోచుకోని మరో సినిమా హీరో ఫ్యాన్సే రాద్ధాంతం చేస్తున్నారని ఆరోపించారు. పరోక్షంగా ఆమె విజయ్ ఫ్యాన్స్ను టార్గెట్ చేశారనే టాక్ నడుస్తోంది.
News January 14, 2026
క్యాబేజీలో రెక్కల పురుగు నివారణకు సూచనలు

క్యాబేజీలో రెక్కల పురుగు లార్వాలు ఆకుల అడుగు భాగాన చేరి తినడం వల్ల ఆకులు వాడి ఎండిపోతాయి. వీటి ఉద్ధృతి ఎక్కువైతే ఆకులకు రంధ్రాలు పడి క్యాబేజీ పరిమాణం తగ్గుతుంది. దీని నివారణకు ప్రతి 25 క్యాబేజీ వరుసలకు 2 వరుసల ఆవ మొక్కలను ఎర పంటగా నాటాలి. రెక్కల పురుగు గుడ్లను నాశనం చేసేందుకు 5% వేపగింజల ద్రావణాన్ని, ఉద్ధృతి మరీ ఎక్కువైతే లీటరు నీటికి నోవాల్యురాన్1ml కలిపి కోతకు 15 రోజుల వ్యవధిలో పిచికారీ చేయాలి.


