News October 22, 2024

HYD: కాంగ్రెస్ పాలనలో రైతాంగం మోసపోతుంది: హరీశ్‌రావు

image

కాంగ్రెస్ పాలనలో రాష్ట్ర రైతాంగం అన్ని రకాలుగా మోసపోతున్నారాని మాజీ మంత్రి హరీశ్‌రావు అన్నారు. రైతు బంధు ఇయ్యక, రుణమాఫీ చెయ్యక, బోనస్ అందక.. చివరకు పంట కొనుగోలు కూడా చేయకపోవడం అన్నదాతకు శాపంగా మారిందని మండిపడ్డారు. వెంటనే హామీలను నిలుపుకోవాలని హరీశ్‌రావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 

Similar News

News January 11, 2026

HYD: ఆ నలుగురు లేకపోయినా!

image

ఎవరైనా కన్నుమూస్తే పాడె కట్టి నలుగురు మోసే అంతిమయాత్ర మన సంప్రదాయం. అయితే కాలానికి తగ్గట్టు ఆ విధానానికి ముగింపు పడుతోంది. పాడె మోయడానికి బదులుగా ‘పరమపద వాహనాలు’ అందుబాటులోకి వచ్చాయి. మృతదేహాన్ని సురక్షితంగా తరలించడమే కాకుండా, కుటుంబ సభ్యులు కూర్చునే సౌకర్యం కల్పించారు. శ్మశానం వరకూ గౌరవంగా అంతిమయాత్ర నిర్వహించేలా ఈ వాహనాలు మార్గం చూపుతున్నాయి. ఆ నలుగురు లేనివారికి.. ఆఖరి మజిలీ సగౌరవంగా సాగుతోంది.

News January 11, 2026

HYD: GHMCలో విలీనం.. ఇక కుదరదు

image

GHMCలో మున్సిపాలిటీల విలీనం తర్వాత అనధికారిక హోర్డింగులు, బ్యానర్లు, ప్రకటనా నిర్మాణాలపై అధికారులు నగరవ్యాప్త స్పెషల్ డ్రైవ్‌ను చేపట్టారు. ప్రజా, రోడ్డు భద్రత, నగర సౌందర్యం కాపాడేందుకు ఈ చర్యలు తీసుకుంటున్నామని అధికారులు తెలిపారు. అన్నీ జోన్లలో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసిన GHMC దశలవారీగా నిరంతరం ఈ డ్రైవ్‌ను చేపడుతుంది. అనధికారిక ప్రకటనలను ఏర్పాటు చేస్తే కఠినచర్యలు చేపడతామని హెచ్చరించింది.

News January 11, 2026

ఫ్యూచర్ సిటీ భూములు.. రైతులకు ఇవ్వాలని డిమాండ్!

image

గత ప్రభుత్వం సేకరించిన 19,333 ఎకరాల ఫార్మా సిటీ భూములను ప్రస్తుత ప్రభుత్వం ‘ఫ్యూచర్ సిటీ’గా మార్చడం న్యాయపరమైన వివాదాలకు దారితీస్తోంది. ఒక నిర్దిష్ట ‘ప్రజా ప్రయోజనం’ కోసం సేకరించిన భూమిని ఇతర వాణిజ్య అవసరాలకు మళ్లించడంపై 2013 భూసేకరణ చట్టంలోని సెక్షన్ 101 ప్రకారం అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. నిర్దేశిత ప్రాజెక్టును రద్దు చేసినప్పుడు, ఆ భూములను తిరిగి రైతులకు అప్పగించాలనే డిమాండ్ పెరుగుతోంది.