News October 22, 2024

చార్మినార్ బ్యూటిఫికేషన్ పనులకు NTPC నిధులు

image

చారిత్రాత్మక కట్టడం చార్మినార్​ బ్యూటిఫికేషన్​ పనుల నిర్వహణకై NTPC సంస్థ తమ CSR​లో భాగంగా స్వచ్ఛ్​ ఐకానిక్​ ప్లేసేస్​ ప్రాజెక్ట్ కింద GHMCతో ఒప్పందం కుదుర్చుకుంది. ఇరు సంస్థల ప్రతినిధులు MOUలపై సంతకాలు చేశారు. NTPC AGM అఖిల్​ పట్నాయక్​, కులీకుత్​బ్​‌షా అర్బన్​ డెవలప్​మెంట్ అథారిటీ చీఫ్​ ఇంజనీర్​ జి.గురువీర లు ఫైళ్ల సంతకాలు చేసి, పరస్పరం మార్చుకున్నారు. దీనికి నిధులను NTPC సంస్థ సమకూర్చనుంది.

Similar News

News November 10, 2025

జూబ్లీహిల్స్ బై పోల్: డెమో తర్వాత అసలు ఓటింగ్!

image

రేపు సూర్యుడు ఉదయించే లోపే(5AM) జూబ్లీహిల్స్ బై పోల్‌లో పోటీలో ఉన్న క్యాండిడేట్లందరూ (58 మంది) ఓటేస్తారు. అది తాము వేసిన గుర్తుకే పడిందా? లేదా? అనేది నిర్ధారించుకుంటారు. డెమో ఓకే అయితేనే సంతృప్తి వ్యక్తం చేస్తారు. లేకపోతే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళతారు. ఈ తతంగం పూర్తయిన తరువాత మోడల్ బ్యాలెట్ జరిగినట్లు PO అధికారికంగా ధ్రువీకరిస్తారు. ఆ తరువాత ఉదయం 7 గంటలకు అసలు ఎన్నిక మొదలవుతుంది.

News November 10, 2025

జూబ్లీ బైపోల్: సెన్సిటివ్ పోలింగ్ స్టేషన్ల వద్ద పారామిలటరీలు

image

జూబ్లీ ఉప ఎన్నిక కోసం EC మొత్తం 407 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఇందులో 50 శాతానికి పైగా 65 ప్రాంతాల్లోని 226 పోలింగ్ కేంద్రాలు సమస్యాత్మకంగా గుర్తించారు. హైదరాబాద్ పోలీసులు, కేంద్ర బలగాలు సంయుక్తంగా బందోబస్తు నిర్వహించనున్నాయి. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద పారామిలటరీ బలగాలను మోహరించనున్నారు. NOV 14న ఓట్ల లెక్కింపు కోసం 42 కౌంటింగ్ టేబుల్స్ ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.

News November 10, 2025

జూబ్లీ బైపోల్: పోలింగ్‌ కోసం 3 వేల మంది ఉద్యోగులు

image

రేపటి జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కోసం ఎన్నికల అధికారులు సర్వం సిద్ధం చేశారు. యూసుఫ్‌గూడలోని కోట్ల విజయభాస్కర్ స్టేడియం వేదికగా ఈవీఎంలు, వీవీప్యాట్ల డిస్ట్రిబ్యూషన్ చేస్తారు. ఉప ఎన్నిక బరిలో 58 మంది అభ్యర్థులు(+నోటా) బరిలో ఉండగా.. 4 బ్యాలెట్ యూనిట్లు వినియోగిస్తున్నారు. 3 వేల మంది ఉద్యోగులు విధులు నిర్వహించనున్నారు.