News October 22, 2024
వెంగారెడ్డిపాలెం వద్ద రోడ్డు పక్కన శవం

సంగం మండలం వెంగారెడ్డిపాలెం గ్రామ సమీపంలో జాతీయ రహదారి పక్కన మంగళవారం ఓ గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని స్థానికులు కనుగొన్నారు. పోలీసులు సమాచారం అందించగా ఎస్సై రాజేశ్ ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. రోడ్డు పక్కనే చెట్ల పొదల మధ్య మృతదేహం ఉంది. మృతుడి సుమారు 60 సంవత్సరాలు ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. మృతుడి వివరాలు తెలియాల్సి ఉందని తెలిపారు.
Similar News
News January 10, 2026
ఆధునిక సాగుతోనే రైతులకు మేలు: కలెక్టర్

వ్యవసాయంలో సాంకేతిక విజ్ఞానాన్ని అందిపుచ్చుకుని రైతులు మెరుగైన లాభాలు సాధించాలని జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల సూచించారు. శనివారం కోవూరులో ఛాంపియన్ ఫార్మర్ శ్రీనివాసులు సాగు చేస్తున్న వరి పొలాన్ని ఆయన పరిశీలించారు. పురుగుల నివారణకు వాడుతున్న సోలార్ లైట్ ట్రాప్స్ పనితీరును అడిగి తెలుసుకున్నారు. ఇలాంటి పద్ధతులను గ్రామంలోని ఇతర రైతులకు కూడా వివరించాలని అధికారులను ఆదేశించారు.
News January 10, 2026
ఫ్లెమింగో ఫెస్టివల్.. భీములవారిపాళెంలో బోటు షికారు చేద్దాం రండి!

భీములవారిపాళెంలో పడవ షికారు, సరస్సు మధ్యలో పారాగ్లైడింగ్( నీళ్లమధ్యలో గాలిలో ఎగురుతూ విహరించడం) ఏర్పాటు చేశారు. సూమారు 50 వేల మంది వరకు పడవ షికారుకు వస్తారని అంచనా. ఒక్కోపడవలో 20 మందినే అనుమతించి లైఫ్ జాకెట్లతో భద్రతా చర్యలు తీసుకుంటున్నారు. 15 ఏళ్ల లోపు పిల్లలకు బోటు షికారు ఉచితం కాగా పెద్దలు రూ.30 టికెట్ తీసుకోవాలి. VIP బోటు షికారు కోసం రెండు ప్రత్యేక పడవలను ఏర్పాటు చేశారు.
News January 10, 2026
కాకాణి, సోమిరెడ్డి మధ్య ఇరిగేషన్ వార్ !

నువ్వు దోచుకున్నావంటే.. నువ్వే ఎక్కువ దోచుకున్నావంటూ పరస్పరం కాకాణి, సోమిరెడ్డి విమర్శించుకుంటున్నారు. వీరిద్దరిలో ఎవరు అధికారంలో ఉన్నా.. ప్రతిపక్షంలో ఉన్నా ఇరిగేషన్ పనుల అవినీతే లేవనెత్తుతున్నారు. కనుపూరు కాలువ, కండలేరు స్పిల్ వే, సర్వేపల్లి కాలువ, చెరువు షట్టర్ పనులపై విమర్శించుకుంటున్నారు తప్పితే.. ప్రజలు కష్టాలను గాలికొదిలేస్తున్నారన్నా అపవాదు నెలకొంది.


