News October 23, 2024
సిగ్నల్స్ వద్ద ఉండే పిల్లలు నిద్రపోయే కనిపిస్తున్నారా?
హైదరాబాద్లోని ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద భిక్షాటన చేసుకునే కొందరు వారి పిల్లలను నిద్రపుచ్చేందుకు డ్రగ్స్ వాడుతున్నారని సామాజిక వేత్తలు స్వాతి& విజయ్లు ఆరోపించారు. ఎందుకు నిద్రపోతున్నారో తెలియకుండానే బాల్యం పూర్తవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి వాటిపై నోరు విప్పాలని, అంతా కలిసి అలాంటి పిల్లలను కాపాడేందుకు ముందుకు సాగుదామని వీరు క్యాంపెయిన్ రన్ చేస్తున్నారు. దీనిపై కరపత్రాలనూ పంచుతున్నారు.
Similar News
News October 23, 2024
సర్ఫరాజ్ ఖాన్లో ఆ బలహీనత ఉంది: బ్రాడ్ హాగ్
యువ బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ బ్యాటింగ్ టెక్నిక్పై ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ బ్రాడ్ హాగ్ సందేహాలు వ్యక్తం చేశారు. ‘అతడి విషయంలో నాకు ఒకటే ప్రధాన లోపం కనిపిస్తోంది. ఆయన ప్రస్తుతం ఆడుతున్న టెక్నిక్తో బౌన్స్ ఎక్కువగా ఉండే సౌతాఫ్రికా, ఇంగ్లండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియాల్లో బౌన్సర్లు ఆడలేరు. ఆస్ట్రేలియా పర్యటనలో తుది జట్టులో ఛాన్స్ వస్తే ఖాన్ ఎలా ఆడతారన్నది ఆసక్తికరం’ అని పేర్కొన్నారు.
News October 23, 2024
జమిలీ ఎన్నికలతో చాలా ప్రమాదం: బీవీ రాఘవులు
TG: జమిలీ ఎన్నికలతో దేశానికి చాలా ప్రమాదమని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు అన్నారు. ఒకే దేశం ఒకే ఎన్నికలను దేశంలోని అన్ని పార్టీలను వ్యతిరేకిస్తున్నాయని చెప్పారు. జమిలీ ఎన్నికలతో ఖర్చు తగ్గుతుందన్న కేంద్రం మాటలు బూటకమని వ్యాఖ్యానించారు. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలను రద్దు చేసే హక్కు మోదీకి లేదని మండిపడ్డారు. జమిలీ ఎన్నికల తర్వాత అధ్యక్ష తరహా పాలన వస్తుందని అన్నారు.
News October 23, 2024
నీతా అంబానీ నీటి సీసా విలువ ఎంతంటే…
రిలయన్స్ అధినేత ముకేశ్ భార్య నీతా అంబానీ నీళ్లు తాగేందుకు 24 క్యారట్ల బంగారు సీసాను వాడతారని వారి సన్నిహిత వర్గాలు చెబుతుంటాయి. ఆ వివరాల ప్రకారం.. డిజైనర్ ఫెర్నాండో ఆల్టమిరానో రూపొందించిన ఆ బాటిల్ విలువ రూ.49 లక్షల వరకూ ఉంటుంది. అందులో తాగే నీటిని ఫ్రాన్స్, ఫిజీ, ఐస్లాండ్ దేశాల్లో ప్రకృతిసిద్ధంగా లభించే నీటిని తెప్పించుకుంటారు. అగ్ర కుబేరుడి భార్య అంటే మెయింటెనెన్స్ ఆమాత్రం ఉంటుందిగా!