News October 23, 2024

ఇండియాలోనే అత్యంత నెమ్మదైన రైలు ఏదంటే..

image

హౌరా-అమృత్‌సర్ రైలుకు అత్యంత నెమ్మదిగా గమ్యం చేరే రైలుగా పేరుంది. 111 స్టేషన్లలో ఆగుతూ వెళ్లడం వల్ల ఆఖరి స్టేషన్‌కు చేరుకునేందుకు 37 గంటలు పడుతుంటుంది. బెంగాల్, బిహార్, యూపీ, హరియాణా, పంజాబ్ రాష్ట్రాల మీదుగా 1910 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది. ఈరోజు రాత్రి 7.15 గంటలకు హౌరా స్టేషన్లో బయలుదేరితే ఎల్లుండి ఉదయం 8.40 గంటలకు అమృత్‌సర్ చేరుతుంది. టికెట్ ధర తక్కువే కావడంతో ఈ రైలుకు డిమాండ్ ఎక్కువే.

Similar News

News October 23, 2024

చలి మొదలైంది..

image

తెలుగు రాష్ట్రాల్లో చలి మొదలైంది. తెల్లవారుజామున, లేట్ నైట్స్ చలిగాలులు వీస్తున్నాయి. దీంతో ప్రజలు ఉన్ని దుస్తులు ధరించి చలి నుంచి రక్షణ పొందాలని నిపుణులు సూచిస్తున్నారు. వాతావరణ మార్పుల వల్ల జ్వరాల బారినపడే అవకాశాలు ఉంటాయని చెబుతున్నారు. మరోవైపు తుఫాన్ ప్రభావంతో ఇరు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఇక మధ్యాహ్నం సమయంలో ఎండ దంచుతోంది. దీంతో భిన్నమైన వాతావరణం ఉంటోంది.

News October 23, 2024

రైతుల సమస్యలపై ఎల్లుండి నుంచి ఆందోళనలు

image

TG: అన్నదాతల సమస్యలు పరిష్కరించాలనే డిమాండ్‌తో ఈ నెల 25 నుంచి 31 వరకు అఖిల భారత ప్రగతిశీల రైతు సంఘం ఆందోళనలకు పిలుపునిచ్చింది. రైతులకు ఎలాంటి షరతులు లేకుండా రూ.2లక్షల రుణమాఫీ చేయాలని, అన్ని రకాల పంటలకు ₹500 బోనస్ చెల్లించాలని, 58 ఏళ్లు దాటిన ప్రతి రైతు, వ్యవసాయ కార్మికులకు ఏడాదికి ₹10వేల పెన్షన్ ఇవ్వాలని కోరింది. అన్ని జిల్లా, మండల కేంద్రాల్లో జరిగే ఆందోళనల్లో రైతన్నలు పాల్గొనాలని పిలుపునిచ్చింది.

News October 23, 2024

బీఎస్సీ నర్సింగ్ ప్రవేశాలకు వెబ్ ఆప్షన్ల నమోదు ప్రారంభం

image

AP: బీఎస్సీ నర్సింగ్ కోర్సుల్లో కన్వీనర్ కోటా ప్రవేశాలకు వెబ్ ఆప్షన్ల నమోదు ప్రక్రియ ప్రారంభమైంది. ఈ నెల 25వ తేదీ రాత్రి 9గంటల్లోగా విద్యార్థులు ఆప్షన్లు నమోదు చేసుకోవాలని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ తెలిపింది. ఆప్షన్ల నమోదులో సాంకేతిక సమస్యలు తలెత్తితే 9000780707, 8008250842 నంబర్లను సంప్రదించాలని రిజిస్ట్రార్ రాధికారెడ్డి తెలిపారు.