News October 23, 2024
సిద్ధిఖీ హత్య.. నిందితుడికి టెన్త్లో 78% మార్కులు!
మహారాష్ట్రలో ఎన్సీపీ నేత బాబా సిద్ధిఖీని హత్య చేసిన షూటర్స్లో ఒకడైన UPకి చెందిన ధర్మరాజ్ రాజేశ్ కశ్యప్ గురించి ఆసక్తికర విషయం తెలిసింది. అతను టెన్త్ క్లాస్లో 78శాతం మార్కులు సాధించినట్లు ధర్మరాజ్ సోదరుడు తెలిపారు. నాడు ధర్మరాజ్ను మెడిసిన్ చదివించాలని తల్లిదండ్రులు భావించినట్లు చెప్పాడు. అయితే గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్ణోయ్ను చూసి ఆకర్షితుడయ్యాడని, డబ్బు కోసం తప్పుదారి పట్టాడని పేర్కొన్నారు.
Similar News
News October 23, 2024
ముగిసిన క్యాబినెట్ భేటీ
AP: రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ముగిసింది. భేటీ వివరాలను సీఎం చంద్రబాబు సాయంత్రం 4గంటలకు ప్రెస్మీట్లో వెల్లడించనున్నారు. ఇసుక, ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం, కొత్త రేషన్ కార్డుల జారీ, కొత్త మద్యం పాలసీ, అసెంబ్లీ సమావేశాలు, వాలంటీర్ల కొనసాగింపు, రేషన్ డీలర్ల నియామకం, పోలవరం, అమరావతిలో ప్రాజెక్టుల నిర్మాణం సహా పలు అంశాలపై చర్చించినట్లు సమాచారం.
News October 23, 2024
రేపు మ.12 గంటలకు ఏం జరగనుంది?
AP: టీడీపీ, వైసీపీ చేసిన తాజా ట్వీట్లు రాష్ట్ర రాజకీయాల్లో ఉత్కంఠ రేకెత్తిస్తున్నాయి. రేపు మధ్యాహ్నం 12 గంటలకు ‘Big Expose’ అంటూ తొలుత టీడీపీ ట్వీట్ చేసింది. ఆ తర్వాత ‘truth bomb dropping’ అని వైసీపీ పోస్ట్ పెట్టింది. దీంతో ఆ పోస్టులకు అర్థం ఏంటి? రేపు ఏం చెప్పబోతున్నాయి? అని టీడీపీ, వైసీపీ శ్రేణుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. మీకేమైనా తెలిస్తే కామెంట్ చేయండి మరి.
News October 23, 2024
రేవంత్ ఇప్పటికైనా లెంపలేసుకుంటారా?: KTR
TG: BRS నుంచి కాంగ్రెస్లో చేరిన MLAలపై వేటువేయాలని MLC జీవన్రెడ్డి చేసిన కామెంట్స్పై KTR స్పందించారు. ‘రేవంత్ గారు.. మీ సొంత పార్టీ నేతనే మీరు చేసిన MLAల ఫిరాయింపులు అప్రజాస్వామికమని, దుర్మార్గమైన చర్య అని సూటిగా వేలెత్తి చూపుతున్నారు. ఇప్పటికైనా మీరు లెంపలేసుకుంటారా? జీవన్రెడ్డి వంటి సీనియర్ నేత ఇది కాంగ్రెస్ విధానాలకు వ్యతిరేకమని మీ దిగజారుడు రాజకీయాలపై దుమ్మెత్తి పోశారు’ అని ట్వీట్ చేశారు.