News October 23, 2024
STOCK MARKETS: ఆరంభ లాభాలను నిలబెట్టుకుంటాయా!
బెంచ్మార్క్ సూచీలు స్వల్ప లాభాల్లో మొదలయ్యాయి. గ్లోబల్ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలే అందాయి. ఆకర్షణీయ ధరల్లో లభిస్తున్న బలమైన షేర్లను ఇన్వెస్టర్లు కొంటున్నారు. ప్రస్తుతం సెన్సెక్స్ 80,381 (+158), నిఫ్టీ 24,521 (+49) వద్ద ట్రేడవుతున్నాయి. ఈ ఆరంభ లాభాలను నిలబెట్టుకుంటాయా లేదా చూడాల్సి ఉంది. రియాల్టి, ఆయిల్ అండ్ గ్యాస్ షేర్లపై సెల్లింగ్ ప్రెజర్ నెలకొంది. ఐటీ, ఫైనాన్స్, మెటల్ షేర్లు పుంజుకున్నాయి.
Similar News
News October 23, 2024
ముగిసిన క్యాబినెట్ భేటీ
AP: రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ముగిసింది. భేటీ వివరాలను సీఎం చంద్రబాబు సాయంత్రం 4గంటలకు ప్రెస్మీట్లో వెల్లడించనున్నారు. ఇసుక, ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం, కొత్త రేషన్ కార్డుల జారీ, కొత్త మద్యం పాలసీ, అసెంబ్లీ సమావేశాలు, వాలంటీర్ల కొనసాగింపు, రేషన్ డీలర్ల నియామకం, పోలవరం, అమరావతిలో ప్రాజెక్టుల నిర్మాణం సహా పలు అంశాలపై చర్చించినట్లు సమాచారం.
News October 23, 2024
రేపు మ.12 గంటలకు ఏం జరగనుంది?
AP: టీడీపీ, వైసీపీ చేసిన తాజా ట్వీట్లు రాష్ట్ర రాజకీయాల్లో ఉత్కంఠ రేకెత్తిస్తున్నాయి. రేపు మధ్యాహ్నం 12 గంటలకు ‘Big Expose’ అంటూ తొలుత టీడీపీ ట్వీట్ చేసింది. ఆ తర్వాత ‘truth bomb dropping’ అని వైసీపీ పోస్ట్ పెట్టింది. దీంతో ఆ పోస్టులకు అర్థం ఏంటి? రేపు ఏం చెప్పబోతున్నాయి? అని టీడీపీ, వైసీపీ శ్రేణుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. మీకేమైనా తెలిస్తే కామెంట్ చేయండి మరి.
News October 23, 2024
రేవంత్ ఇప్పటికైనా లెంపలేసుకుంటారా?: KTR
TG: BRS నుంచి కాంగ్రెస్లో చేరిన MLAలపై వేటువేయాలని MLC జీవన్రెడ్డి చేసిన కామెంట్స్పై KTR స్పందించారు. ‘రేవంత్ గారు.. మీ సొంత పార్టీ నేతనే మీరు చేసిన MLAల ఫిరాయింపులు అప్రజాస్వామికమని, దుర్మార్గమైన చర్య అని సూటిగా వేలెత్తి చూపుతున్నారు. ఇప్పటికైనా మీరు లెంపలేసుకుంటారా? జీవన్రెడ్డి వంటి సీనియర్ నేత ఇది కాంగ్రెస్ విధానాలకు వ్యతిరేకమని మీ దిగజారుడు రాజకీయాలపై దుమ్మెత్తి పోశారు’ అని ట్వీట్ చేశారు.