News October 23, 2024
నామినేషన్ వేసిన ప్రియాంకా గాంధీ
కేరళలోని వయనాడ్ పార్లమెంట్ స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ లోక్సభ అభ్యర్థిగా ప్రియాంకా గాంధీ నామినేషన్ వేశారు. కాంగ్రెస్ పార్టీ అగ్రనేతల సమక్షంలో ఆమె నామినేషన్ పత్రాలపై సంతకం చేశారు. మరికాసేపట్లో ఆమె రోడ్షోలో పాల్గొంటారు.
Similar News
News October 23, 2024
13వేల KMS సైకిల్పై ప్రయాణించి రొనాల్డోను చేరిన అభిమాని
ప్రొఫెషనల్ ఫుట్బాల్ ప్లేయర్ క్రిస్టియానో రొనాల్డోకు ప్రపంచవ్యాప్తంగా అభిమానులున్నారు. చైనాకు చెందిన ఓ వీరాభిమాని ఏకంగా 13వేల కిలోమీటర్లు ఆరున్నర నెలలు సైకిల్పై ప్రయాణించి రొనాల్డోను కలుసుకున్నారు. సౌదీ ప్రో లీగ్లో అల్ షబాబ్తో జరిగిన మ్యాచ్ తర్వాత అభిమాని గురించి తెలుసుకొని రొనాల్డో అతణ్ని కలిసి ఆటోగ్రాఫ్ ఇచ్చారు. విమానంలో ప్రయాణించే స్తోమత లేకపోవడంతో అతను సైకిల్పై వెళ్లినట్లు తెలుస్తోంది.
News October 23, 2024
GOOD NEWS: రూ.99కే లిక్కర్ వచ్చేసింది!
AP: రాష్ట్రంలో రూ.99కే క్వార్టర్ మద్యం అమ్మకాలు ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం ఒక్కో లిక్కర్ షాప్నకు 3 నుంచి 8 కేసులు మాత్రమే సరఫరా చేస్తుండగా, త్వరలో పూర్తిస్థాయిలో అందుబాటులోకి రానున్నట్లు వైన్స్ నిర్వాహకులు చెబుతున్నారు. షార్ట్స్ పేరుతో బ్రాండీ, విస్కీ విక్రయాలు కూడా జరుగుతున్నాయి. దీంతో మందుబాబులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
News October 23, 2024
గాజా యుద్ధాన్ని ముగించేందుకు ఇదే సమయం: అమెరికా
గాజా యుద్ధాన్ని ముగించేందుకు ఇజ్రాయెల్కు ఇదే సరైన సమయమని అమెరికా విదేశాంగ మంత్రి బ్లింకెన్ తాజాగా పేర్కొన్నారు. ఇరాన్తో ఉద్రిక్తతల్ని పెంచొద్దని ఆ దేశానికి సూచించారు. ‘గత ఏడాది అక్టోబరు 7 తర్వాతి నుంచి గాజా విషయంలో ఇజ్రాయెల్ నిర్దేశించుకున్న లక్ష్యాలన్నింటినీ సాధించింది. ఇప్పుడు ఆ విజయాలను శాశ్వతం చేసుకోవాలి. పరిస్థితి మరింత దిగజారనివ్వకూడదు. గాజాకిప్పుడు మానవతాసాయం అవసరం’ అని పేర్కొన్నారు.