News October 23, 2024

NZB: అయోధ్యలో విశ్వశాంతి మహాయాగం పోస్ట్‌పోన్ తేదీలు ఇవే..!

image

అయోధ్యలో శ్రీ మహానారాయణ దివ్య రుద్ర సహిత శత సహస్ర చండీ విశ్వశాంతి మహా యాగాన్ని నిర్వహిస్తున్నట్లు నిర్వహణ కమిటీ సభ్యుడు, TTD మాజీ ఈఓ LV.సుబ్రమణ్యం తెలిపిన విషయం తెలిసిందే. కాగా గతంలో ఈ యాగం NOV 2 నుంచి అని ప్రకటించగా తేదీలను పోస్ట్ పోన్ చేశారు. NOV 18 నుంచి JAN 1 వరకు నిర్వహించనున్నట్లు ప్రకటించారు. పాల్గొనే వారు తమ పేరును నమోదు చేసుకోవాలని తెలిపారు. వివరాలకు సెల్: 7780252277 సంప్రదించాలన్నారు.

Similar News

News January 27, 2026

నిజామాబాద్: ఇందిరమ్మ ఇండ్లకు రూ.266.94 కోట్లు

image

నిజామాబాద్ జిల్లాలో 19,397 ఇందిరమ్మ ఇండ్లు లక్ష్యం కాగా 16,919 ఇండ్లు మంజూరు అయ్యాయని కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. అందులో 12,850 మార్కింగ్ పూర్తి అయ్యాయని, 9,865 ఇండ్లు బేస్మెంట్ పూర్తి అయ్యాయన్నారు. రూఫ్ లెవెల్‌కు 6,651 ఇండ్లు, స్లాబ్ లెవెల్‌కు 4,981 ఇండ్లు, 216 ఇండ్లు పూర్తి అయ్యాయన్నారు. ఇందుకోసం రూ.266.94 కోట్లు ఖర్చు చేసినట్లు కలెక్టర్ పేర్కొన్నారు.

News January 27, 2026

నిజామాబాద్ జిల్లాలో 8 భారీ, మధ్య తరహా పరిశ్రమలు

image

నిజామాబాద్ జిల్లాలో 8 భారీ, మధ్య తరహా పరిశ్రమలు రూ.368.45 కోట్ల పెట్టుబడితో స్థాపించబడ్డాయని కలెక్టర్ ఇలా త్రిపాఠి చెప్పారు. వీటి ద్వారా 7,324 మందికి ఉపాధి కల్పించబడిందన్నారు. అలాగే జిల్లాలో 900 సూక్ష్మ, చిన్నతరహా పరిశ్రమలను రూ.516.60 కోట్ల పెట్టుబడితో స్థాపించి 6,983 మందికి ఉపాధి కల్పిస్తున్నారని వివరించారు.

News January 27, 2026

NZB: రూ.782.31 కోట్ల రుణ మాఫీ: కలెక్టర్

image

రాష్ట్ర ప్రభుత్వం పంట రుణ మాఫీ పథకం ద్వారా నిజామాబాద్ జిల్లాలో ఇప్పటి వరకు రూ.782.31 కోట్లు రుణ మాఫీ చేసినట్లు కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. నాలుగు విడతల్లో మొత్తం 1,00,612 మంది రైతుల పంట రుణాలు మాఫీ చేశారన్నారు. అలాగే రైతు భీమాకు అర్హత కలిగి వివిధ కారణాలతో చనిపోయిన 308 రైతులకు సంబంధించిన వారి నామిని బ్యాంకు ఖాతాలలో రూ.15.40 కోట్ల నేరుగా జమ చేసినట్లు వివరించారు.