News October 23, 2024
వేలంలోకి రిషభ్ పంత్? RCB తీసుకుంటుందా?
IPL మెగా వేలంలోకి DC కెప్టెన్ పంత్ వచ్చే అవకాశముందని క్రీడా వర్గాలు పేర్కొంటున్నాయి. పంత్ను కెప్టెన్గా కొనసాగించాలని DC మేనేజ్మెంట్ అనుకోవట్లేదని, దీంతో వేలంలోకి రావాలని ఆయన నిర్ణయించుకున్నట్లు సమాచారం. వేలంలోకి వస్తే ఆయన్ను తీసుకోవాలని RCB భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. మరోవైపు కేఎల్ రాహుల్ను LSG, శ్రేయస్ను KKR వదులుకోనున్నట్లు తెలుస్తోంది. దీనిపై మరో వారంలో స్పష్టత రానుంది.
Similar News
News October 23, 2024
రాష్ట్రంలో మెయనైస్పై నిషేధం?
TG: షావర్మా, ఫ్రైడ్ చికెన్, పిజ్జాపై మెయనైస్ వేసుకుని తింటే ఆ రుచే వేరు. అయితే పచ్చిగుడ్డుతో తయారుచేసే మెయనైస్ వల్ల ఈ ఏడాది HYDలో 10 ఫుడ్ పాయిజన్ కేసులు నమోదైనట్లు ఫుడ్ సేఫ్టీ అధికారులు తెలంగాణ ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. తెల్లగా, క్రీమ్లాగా ఉండే మెయనైస్లో హానికర సూక్ష్మక్రిములు ఉంటాయని, దాన్ని బ్యాన్ చేయాలని కోరారు. కాగా ఇప్పటికే మెయనైస్పై కేరళ సర్కారు నిషేధం విధించింది.
News October 23, 2024
MH ఎన్నికలు.. 85 సీట్ల చొప్పున పోటీ
మహారాష్ట్రలో మహావికాస్ అఘాడీ కూటమి సీట్ల పంపకంపై క్లారిటీ వచ్చింది. 85 సీట్ల చొప్పున పోటీ చేయాలని కాంగ్రెస్, శివసేన (ఉద్ధవ్ థాక్రే), ఎన్సీపీ (శరద్ పవార్) పార్టీలు నిర్ణయించాయి. మిగతా 18 సీట్లపై కూటమిలోని మిగతా పార్టీలతో చర్చించి రేపు నిర్ణయం తీసుకుంటామని మహారాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ నానా పటోలే తెలిపారు. ఈసారి తాము కచ్చితంగా ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని ధీమా వ్యక్తం చేశారు.
News October 23, 2024
గొంతులో దోశ ఇరుక్కుని చనిపోయాడు!
TG: గొంతులో దోశ ఇరుక్కుని వ్యక్తి మరణించిన షాకింగ్ ఘటన నాగర్ కర్నూల్ జిల్లాలో జరిగింది. కల్వకుర్తికి చెందిన వెంకటయ్య (41) ఇంట్లో మద్యం తాగి దోశ తిన్నాడు. అది గొంతులో ఇరుక్కుపోవడంతో ఊపిరాడలేదు. కొద్దిసేపటికే అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. వెంటనే ఆస్పత్రికి తరలించగా అప్పటికే మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. గతంలో కేరళలో ఇడ్లీలు తినే పోటీలో ఓ వ్యక్తి ఇడ్లీలు తింటూ ఊపిరాడక చనిపోయాడు.