News October 23, 2024

పెన్షన్ల సమస్యకు గ్రామ సభల్లో పరిష్కారం: ప్రభుత్వం

image

AP: గత ప్రభుత్వంలో అనర్హుల పేరిట తొలగించిన పింఛన్లపై క్యాబినెట్ భేటీలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పెన్షన్ల సమస్యను గ్రామ సభల ద్వారా పరిష్కరించాలని నిర్ణయించింది. అలాగే మంగళగిరి ప్రభుత్వాస్పత్రిని 100 పడకలుగా మార్చేందుకు ఆమోదం తెలిపింది. దేవాలయ పాలకమండళ్లలో బ్రాహ్మణులు, నాయీ బ్రాహ్మణులకు సభ్యత్వం ఇవ్వాలని, సభ్యుల సంఖ్యను 15 నుంచి 17కు పెంచాలని నిర్ణయించింది.

Similar News

News October 23, 2024

ఉద్యోగి కారుకు ప్రమాదం.. మేనేజర్ రిప్లై ఇదే..!

image

ఉద్యోగి కారు ప్రమాదానికి గురైంది. కారు ముందుభాగం దెబ్బతిన్న ఫొటోను అతడు తన మేనేజర్‌కి పంపించాడు. ఎవరైనా అయితే నువ్వు ఎలా ఉన్నావనే అడుగుతారు. కానీ ఆ మేనేజర్ మాత్రం ఏ టైమ్‌కి ఆఫీస్‌కి వస్తావో చెప్పు అంటూ రిప్లై ఇచ్చారు. ‘మీరు లేటుగా రావడాన్ని అర్థం చేసుకోగలను. కానీ మీ కుటుంబీకులు మరణిస్తే తప్ప ఆఫీసుకి రాకపోవడాన్ని ఏ సంస్థా సమర్థించదు’ అని జవాబిచ్చారు. ఈ చాట్‌ స్క్రీన్‌షాట్ వైరల్ అవుతోంది.

News October 23, 2024

24 గంటల్లోనే అకౌంట్లలో డబ్బులు పడ్డాయ్: మంత్రి

image

AP: రైతు నుంచి ధాన్యం కొనుగోలు చేసిన 48 గంటల్లో డబ్బులు ఖాతాలో జమ చేస్తామన్న మాటను నిలబెట్టుకున్నామని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. తూ.గో.జిల్లా ధర్మవరానికి చెందిన రైతు నుంచి కొనుగోలు చేసిన ధాన్యానికి 24 గంటల్లోనే నగదు జమ చేసినట్లు తెలిపారు. ‘ఇచ్చిన గడువు కంటే ముందే డబ్బులు చెల్లించాం. రైతులు, కౌలు రైతుల సంక్షేమం కోసం CM, Dy.CM ఆలోచన చేస్తున్నారనడానికి ఇదే తార్కాణం’ అని Xలో పేర్కొన్నారు.

News October 23, 2024

ప్రియాంకా గాంధీకి బెస్ట్ విషెస్: సీఎం రేవంత్

image

కేరళలోని వయనాడ్ లోక్‌సభ ఉపఎన్నికకు ఇవాళ నామినేషన్ వేసిన ప్రియాంకా గాంధీకి సీఎం రేవంత్ ఆల్ ది బెస్ట్ చెప్పారు. ‘ప్రియాంకా గాంధీకి మనస్ఫూర్తిగా విషెస్ చెబుతున్నాను. ఆమె తన శక్తిమంతమైన స్వరంతో ప్రజల ఆకాంక్షలను పార్లమెంటులో గట్టిగా వినిపిస్తారని నేను నమ్ముతున్నాను’ అని ట్వీట్ చేశారు. ప్రియాంక నామినేషన్ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆయన కేరళకు వెళ్లిన సంగతి తెలిసిందే.