News October 23, 2024
ప్రపంచ రికార్డు: 20 ఓవర్లలో 344 రన్స్ బాదేశారు!
పురుషుల అంతర్జాతీయ టీ20ల్లో సరికొత్త రికార్డు నమోదైంది. గాంబియాతో జరిగిన మ్యాచ్లో జింబాబ్వే 20 ఓవర్లలో 344 పరుగులు చేసింది. ఇప్పటి వరకు నేపాల్ పేరిట ఉన్న 314 రన్స్ను బద్దలుగొట్టింది. ఆ జట్టు బ్యాటర్లలో సికందర్ రజా 33 బంతుల్లోనే సెంచరీ(15 సిక్సులు) చేశారు. టీ20 వరల్డ్ కప్నకు క్వాలిఫయర్ మ్యాచులు ఆఫ్రికా దేశాల మధ్య జరుగుతున్నాయి.
Similar News
News October 23, 2024
పుణేలో కోహ్లీ సగటు 133.50.. రేపు కూడా రిపీట్ చేస్తారా?
మహారాష్ట్రలోని పుణే MCA స్టేడియంలో కింగ్ విరాట్ కోహ్లీకి అద్భుతమైన రికార్డు ఉంది. అక్కడ 2 టెస్టుల్లో 3 ఇన్నింగ్స్లు ఆడిన విరాట్ 267 రన్స్ చేశారు. అత్యధిక స్కోర్ 254*గా ఉంది. యావరేజ్ 133.50 కావడం విశేషం. మరి రేపు NZతో ప్రారంభమయ్యే రెండో టెస్టులో కోహ్లీ ఎలా విజృంభిస్తారో చూడాలి.
News October 23, 2024
ఉద్యోగి కారుకు ప్రమాదం.. మేనేజర్ రిప్లై ఇదే..!
ఉద్యోగి కారు ప్రమాదానికి గురైంది. కారు ముందుభాగం దెబ్బతిన్న ఫొటోను అతడు తన మేనేజర్కి పంపించాడు. ఎవరైనా అయితే నువ్వు ఎలా ఉన్నావనే అడుగుతారు. కానీ ఆ మేనేజర్ మాత్రం ఏ టైమ్కి ఆఫీస్కి వస్తావో చెప్పు అంటూ రిప్లై ఇచ్చారు. ‘మీరు లేటుగా రావడాన్ని అర్థం చేసుకోగలను. కానీ మీ కుటుంబీకులు మరణిస్తే తప్ప ఆఫీసుకి రాకపోవడాన్ని ఏ సంస్థా సమర్థించదు’ అని జవాబిచ్చారు. ఈ చాట్ స్క్రీన్షాట్ వైరల్ అవుతోంది.
News October 23, 2024
24 గంటల్లోనే అకౌంట్లలో డబ్బులు పడ్డాయ్: మంత్రి
AP: రైతు నుంచి ధాన్యం కొనుగోలు చేసిన 48 గంటల్లో డబ్బులు ఖాతాలో జమ చేస్తామన్న మాటను నిలబెట్టుకున్నామని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. తూ.గో.జిల్లా ధర్మవరానికి చెందిన రైతు నుంచి కొనుగోలు చేసిన ధాన్యానికి 24 గంటల్లోనే నగదు జమ చేసినట్లు తెలిపారు. ‘ఇచ్చిన గడువు కంటే ముందే డబ్బులు చెల్లించాం. రైతులు, కౌలు రైతుల సంక్షేమం కోసం CM, Dy.CM ఆలోచన చేస్తున్నారనడానికి ఇదే తార్కాణం’ అని Xలో పేర్కొన్నారు.