News October 23, 2024

తండ్రి మరణం తర్వాత జగన్ చెల్లిని మోసం చేశారు: TDP

image

AP: రేపు మధ్యాహ్నం ‘Big Expose’ అంటూ ప్రకటించిన TDP తాజాగా సంచలన ట్వీట్ చేసింది. ఆస్తుల విషయంలో తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డికి ఇచ్చిన మాటను జగన్ తప్పినట్లు షర్మిల, విజయమ్మ లేఖ రాశారని పోస్ట్ చేసింది. ‘ఆస్తులన్నింటినీ నలుగురు మనవళ్లకు సమానంగా పంచాలనే YSR షరతుకు అంగీకరిస్తున్నానని చెప్పి, మరణం తర్వాత మాట తప్పారు’ అని వారు ఆ లేఖలో పేర్కొన్నట్లు తెలిపింది. చెల్లిని దారుణంగా మోసం చేశారని విమర్శించింది.

Similar News

News September 13, 2025

ఘర్షణల తర్వాత తొలిసారి మణిపుర్‌లో అడుగుపెట్టిన మోదీ

image

ప్రధాని మోదీ మణిపుర్ చేరుకున్నారు. ఇంఫాల్‌ ఎయిర్‌పోర్టులో ఆయనకు గవర్నర్ అజయ్ భల్లా, సీఎస్ పునీత్ గోయల్ స్వాగతం పలికారు. రెండేళ్ల నుంచి మణిపుర్‌లో తీవ్ర అల్లర్లు చెలరేగుతున్న విషయం తెలిసిందే. దీనిపై కేంద్రాన్ని, ప్రధానిని టార్గెట్ చేస్తూ కాంగ్రెస్ విమర్శలు కూడా చేసింది. ఈక్రమంలో ఘర్షణల తర్వాత మోదీ తొలిసారి మణిపుర్‌లో పర్యటించడం ప్రాధాన్యం సంతరించుకుంది.

News September 13, 2025

‘మిరాయ్’కి తొలి రోజు భారీ కలెక్షన్స్

image

తేజా సజ్జ హీరోగా కార్తీక్ ఘట్టమనేని తెరకెక్కించిన ఫాంటసీ మూవీ ‘మిరాయ్’ నిన్న థియేటర్లలో విడుదలైన విషయం తెలిసిందే. ఈ చిత్రం తొలి రోజు వరల్డ్ వైడ్‌గా ₹27.20 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టినట్లు మూవీ టీమ్ తెలిపింది. దీంతో ‘హనుమాన్’ తొలిరోజు(₹8 కోట్లు) కలెక్షన్స్‌ను దాటేసింది. తేజ కెరీర్లో ఇవే హయ్యెస్ట్ ఫస్ట్ డే ఓపెనింగ్స్. పాజిటివ్ టాక్ నేపథ్యంలో కలెక్షన్స్ మరింత పెరిగే అవకాశముంది.

News September 13, 2025

1GB ప్లాన్ ఎత్తేయడంపై వివరణ కోరిన TRAI

image

సరసమైన 1GB ఎంట్రీలెవల్ ప్రీపెయిడ్ ప్లాన్‌ ఉపసంహరణకు గల కారణాలను తెలపాలని JIO, AIRTEL సంస్థలను TRAI కోరింది. రూ.249 ప్లాన్ ఎత్తేయడంతో వినియోగదారులపై మరింత భారం పడనుందని ఆందోళన వ్యక్తం చేసింది. ఆఫ్‌లైన్‌లో ఈ ప్లాన్ అందుబాటులో ఉందని JIO తెలుపగా.. వినియోగదారుల ప్రాధాన్యతల ఆధారంగా రూ.249 ప్లాన్‌ను తీసేసినట్లు AIRTEL పేర్కొంది. ప్రస్తుతం ఎంట్రీ లెవెల్ ప్లాన్ ₹299 నుంచి మొదలుకానుంది.