News October 23, 2024
24 గంటల్లోనే అకౌంట్లలో డబ్బులు పడ్డాయ్: మంత్రి

AP: రైతు నుంచి ధాన్యం కొనుగోలు చేసిన 48 గంటల్లో డబ్బులు ఖాతాలో జమ చేస్తామన్న మాటను నిలబెట్టుకున్నామని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. తూ.గో.జిల్లా ధర్మవరానికి చెందిన రైతు నుంచి కొనుగోలు చేసిన ధాన్యానికి 24 గంటల్లోనే నగదు జమ చేసినట్లు తెలిపారు. ‘ఇచ్చిన గడువు కంటే ముందే డబ్బులు చెల్లించాం. రైతులు, కౌలు రైతుల సంక్షేమం కోసం CM, Dy.CM ఆలోచన చేస్తున్నారనడానికి ఇదే తార్కాణం’ అని Xలో పేర్కొన్నారు.
Similar News
News March 17, 2025
AP న్యూస్ రౌండప్

* YSR జిల్లాను YSR కడప జిల్లాగా మారుస్తూ క్యాబినెట్ నిర్ణయం
* భోగాపురం ఎయిర్పోర్టులో బాంబు పేలి ఒకరి మృతి
* తెనాలి: స్పెషల్ తెలుగుకు బదులు తెలుగు క్వశ్చన్ పేపర్ ఇచ్చిన ఇన్విజిలేటర్ సస్పెండ్
* కోనసీమ(D) నెలపతిపాడులో పిల్లలను కాలువలో తోసి తండ్రి సూసైడ్.. బాలుడు(10) సురక్షితం, బాలిక(6) మృతి
* చిత్తూరు TDP కార్యకర్త హత్య కేసులో ఇద్దరు అరెస్ట్
* తిరుమలలో BCY పార్టీ చీఫ్ రామచంద్రయాదవ్ నిరసన..అరెస్ట్
News March 17, 2025
ఈ సమయంలో పండ్లు తింటున్నారా?

మనం ఆరోగ్యంగా ఉండాలంటే పండ్లు తినడం ఎంతో అవసరం. కానీ ఎప్పుడు పడితే అప్పుడు వాటిని ఆస్వాదించడం మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. పరగడుపుతో అస్సలు తినకూడదు. అలా చేస్తే బ్లడ్ షుగర్ లెవెల్స్లో అసమతుల్యత ఏర్పడుతుంది. అలాగే కడుపు నిండా భోజనం చేసిన తర్వాత వీటిని తింటే శరీరంలో విషపూరిత పదార్థాలు పేరుకుపోతాయి. పడుకునే ముందు తీసుకోకూడదు. అజీర్తి సమస్యలు వస్తాయి. డెయిరీ పదార్థాలతో కలిపి వీటిని తినకూడదు.
News March 17, 2025
బీసీ రిజర్వేషన్ల పెంపు బిల్లుకు అసెంబ్లీ ఆమోదం

TG: బీసీ రిజర్వేషన్ల పెంపు బిల్లుకు అసెంబ్లీ ఆమోదం తెలిపింది. బీసీలకు స్థానిక సంస్థలు, విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లను 42శాతానికి పెంచుతూ బిల్లు రూపొందించగా తాజాగా ఆమోదం లభించింది. అనంతరం అసెంబ్లీ రేపటికి వాయిదా పడింది.