News October 24, 2024
చెట్ల పరిరక్షణపై హైడ్రా దృష్టి
HYDలో చెట్ల పరిరక్షణపై హైడ్రా దృష్టి సారించింది. వాల్టా చట్టం అమలుపై GHMC, అటవీ శాఖ అధికారులతో కమిషనర్ రంగనాథ్ సమీక్షించారు. ట్రీ ట్రాన్స్ప్లాంటేషన్కు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. రోడ్లు కాలనీల్లో కూలే స్థితిలో ఉన్న చెట్లను తొలగించాలని ఆదేశించారు.
Similar News
News October 24, 2024
కలుషిత నీరే కారణం.. గుర్లలో డయేరియాపై నివేదిక
AP: విజయనగరం(D) గుర్లలో తాగునీరు కలుషితం కావడం వల్లే డయేరియా వ్యాధి ప్రబలిందని నిపుణుల బృందం తేల్చింది. ఈ మేరకు తన నివేదికను ప్రభుత్వానికి అందించింది. అక్కడ ప్రధాన నీటి వనరు అయిన చంపా నది తీవ్రంగా కలుషితం అవుతోందని పేర్కొంది. నీటి పైపు లైన్లు డ్రైనేజీ వ్యవస్థ గుండా వెళ్లడం, బహిరంగ మల విసర్జన, క్లోరినేషన్ చేయకపోవడం వంటి పలు సమస్యల్ని గుర్తించింది. వ్యాధుల వ్యాప్తిని అరికట్టడానికి సూచనలు చేసింది.
News October 24, 2024
పోలీసుల్ని మర మనుషుల్లా చూస్తున్నారు: ప్రవీణ్ కుమార్
TG: రాష్ట్రంలో శాంతి భద్రతలు దారుణంగా పడిపోయాయని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మండిపడ్డారు. ‘పోలీసులను సీఎం రేవంత్ రెడ్డి మర మనుషుల్లా చూస్తున్నారు. నెలలో వరుసగా 26 రోజులు డ్యూటీ చేస్తే 4 రోజులు సెలవులు ఇస్తామనడం దారుణం. దీనిపై పోలీసుల కుటుంబాలు నల్గొండలో ఆందోళన చేస్తే విధుల్లో ఉన్న పోలీసుల్ని సస్పెండ్ చేశారు. పోలీసుల్లో అశాంతి నెలకొంది. అది ప్రమాదకరం’ అని అన్నారు.
News October 24, 2024
రోహిత్ రికార్డును బ్రేక్ చేసిన సికందర్
గాంబియాపై జరిగిన T20 మ్యాచ్లో జింబాబ్వే కెప్టెన్ సికందర్ రజా రికార్డు సృష్టించారు. టెస్ట్ హోదా ఉన్న దేశాలకు చెందిన ఆటగాళ్లలో ఫాస్టెస్ట్ సెంచరీ(33 బంతుల్లో) చేసిన క్రికెటర్గా నిలిచారు. దీంతో 35 బంతుల్లో శతకం బాదిన రోహిత్ శర్మ, మిల్లర్ల రికార్డును బ్రేక్ చేశాడు. ICC మెన్స్ టీ20 WC సబ్ రీజినల్ ఆఫ్రికా క్వాలియర్స్లో నిన్న గాంబియాపై తలపడిన జింబాబ్వే 344 పరుగులు చేసి వరల్డ్ రికార్డ్ సాధించింది.