News October 24, 2024

రెస్టారెంట్స్ ఫుడ్ క్వాలిటీ చెప్పే ‘స్విగ్గీ సీల్’

image

రెస్టారెంట్లలో పరిశుభ్రత, ఆహార ప్రమాణాలను ధ్రువీకరించేందుకుగాను స్విగ్గీ సీల్ అనే కొత్త సేవలను స్విగ్గీ తీసుకురానుంది. నాణ్యతా ప్రమాణాలు పాటించే రెస్టారెంట్లకు ఈ బ్యాడ్జ్‌ని స్విగ్గీ అందిస్తుంది. కస్టమర్ల నుంచి ఫిర్యాదులొస్తే ఆ బ్యాడ్జిని తొలగిస్తుంది. పరిశుభ్రతపై ఆడిట్ నిర్వహించేందుకు FSSAI గుర్తింపు పొందిన సంస్థలతో టై-అప్ అయినట్లు కంపెనీ తెలిపింది. NOV నాటికి 650 నగరాల్లో ఈ సేవలు తీసుకురానుంది.

Similar News

News March 18, 2025

సెలబ్రిటీలపై కేసు.. పోలీసుల కీలక ఆదేశాలు

image

TG: సోషల్ మీడియాలో బెట్టింగ్ యాప్ ప్రమోషన్లపై పంజాగుట్ట పోలీసులు చర్యలు వేగవంతం చేశారు. నిన్న కేసు నమోదైన 11 మంది సెలబ్రిటీలు, ఇన్‌ఫ్లుయెన్సర్లను ఇవాళ సాయంత్రంలోగా విచారణకు హాజరు కావాలని ఆదేశించారు. నోటీసులు ఇచ్చిన వారిలో విష్ణుప్రియ, సుప్రిత, రీతూ చౌదరి, హర్షసాయి, టేస్టీ తేజ, పరేషాన్ బాయ్స్ ఇమ్రాన్‌, శ్యామల, కిరణ్ గౌడ్‌, సన్నీ యాదవ్‌, సుధీర్ రాజు, అజయ్‌ ఉన్నారు.

News March 18, 2025

రేపు బిల్‌ గేట్స్‌తో చంద్రబాబు భేటీ

image

ఏపీ సీఎం చంద్రబాబు ఇవాళ సాయంత్రం 4 గంటలకు ఢిల్లీకి వెళ్లనున్నారు. కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌ ఇంట్లో జరిగే వివాహ వేడుకకు హాజరుకానున్నారు. రేపు ఆయన మైక్రోసాఫ్ట్ కో-ఫౌండర్ బిల్‌గేట్స్‌తో భేటీ కానున్నారు. విద్య, ఆరోగ్యం, వ్యవసాయ రంగాల్లో సహకారంపై చర్చించనున్నారు. పలు ఒప్పందాలు చేసుకునే అవకాశముంది. రేపు సాయంత్రం CBN తిరిగి అమరావతికి రానున్నారు. 20న అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొంటారు.

News March 18, 2025

పిటిషనర్‌కు షాకిచ్చిన హైకోర్టు.. రూ.కోటి జరిమానా

image

TG: హైకోర్టును తప్పు దోవ పట్టించాలని చూసిన ఓ వ్యక్తికి తగిన శాస్తి జరిగింది. ఉన్నత న్యాయస్థానంలో పిటిషన్ పెండింగ్‌లో ఉంచిన విషయాన్ని దాచి వేరే బెంచ్‌లో ఆర్డర్ తీసుకోవడంపై న్యాయమూర్తి జస్టిస్ నగేశ్ సీరియస్ అయ్యారు. హైకోర్టును తప్పు దోవ పట్టించేలా పిటిషన్ వేసినందుకు రూ.కోటి జరిమానా విధించారు. దీంతో అక్రమ మార్గాల్లో ప్రభుత్వ భూములను సొంతం చేసుకోవాలన్న పిటిషనర్‌కు కోర్టు చెక్ పెట్టింది.

error: Content is protected !!