News October 24, 2024
రోహిత్ రికార్డును బ్రేక్ చేసిన సికందర్
గాంబియాపై జరిగిన T20 మ్యాచ్లో జింబాబ్వే కెప్టెన్ సికందర్ రజా రికార్డు సృష్టించారు. టెస్ట్ హోదా ఉన్న దేశాలకు చెందిన ఆటగాళ్లలో ఫాస్టెస్ట్ సెంచరీ(33 బంతుల్లో) చేసిన క్రికెటర్గా నిలిచారు. దీంతో 35 బంతుల్లో శతకం బాదిన రోహిత్ శర్మ, మిల్లర్ల రికార్డును బ్రేక్ చేశాడు. ICC మెన్స్ టీ20 WC సబ్ రీజినల్ ఆఫ్రికా క్వాలియర్స్లో నిన్న గాంబియాపై తలపడిన జింబాబ్వే 344 పరుగులు చేసి వరల్డ్ రికార్డ్ సాధించింది.
Similar News
News October 24, 2024
ఈవినింగ్ టైం బీటెక్.. గుడ్న్యూస్ చెప్పిన JNTUH
TG: పాలిటెక్నిక్ డిప్లమా పూర్తి చేసి ప్రభుత్వ, ప్రైవేట్ పరిశ్రమల్లో పని చేస్తున్న వారికి JNTUH గుడ్ న్యూస్ చెప్పింది. సాయంత్రం వేళ బీటెక్ చదువుకోవాలి అనుకునే వారికి JNTUHతో పాటు మరో 8 కాలేజీలకు అనుమతిచ్చింది. త్వరలో స్పాట్ ప్రవేశాలకు నోటిఫికేషన్ ఇవ్వనుంది. కోర్సు కాలపరిమితి మూడేళ్లు కాగా ఒక్కో విభాగంలో 30 సీట్లు ఉంటాయి. పని చేస్తున్న సంస్థ కాలేజీకి 75km పరిధిలో ఉండాలి. ఏడాది పని అనుభవం తప్పనిసరి.
News October 24, 2024
బాస్మతియేతర బియ్యంపై ఎంఈపీ తొలగింపు
బాస్మతీయేతర బియ్యం ఎగుమతులను ప్రోత్సహించేందుకు గాను గతంలో నిర్దేశించిన కనీస ఎగుమతి ధరను కేంద్రం తొలగించింది. గత నెలలో ఈ బియ్యం ఎగుమతులపై ఆంక్షలను కేంద్రం ఎత్తివేసింది. టన్నుకు 490 డాలర్ల కనీస ఎగుమతి ధరను(MEP) నిర్ణయించింది. తాజాగా దానిని తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కాగా దేశంలో ఈ బియ్యం నిల్వలు పరిమితంగా ఉండటంతో గతేడాది జులై 20న వీటి ఎగుమతులపై కేంద్రం ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే.
News October 24, 2024
అందుకే షర్మిలపై జగన్ పిటిషన్: YCP
AP: ఆస్తుల విషయంలో చెల్లికి మంచి చేయబోయి జగన్ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని YCP తెలిపింది. ‘సరస్వతి పవర్ విషయంలో లీగల్ సమస్యలున్నాయి. కేసులు తేలాక ఆస్తులు ఇస్తానని MoU రాసిచ్చారు. కానీ చట్ట విరుద్ధంగా <<14429978>>షేర్లు <<>>బదిలీ చేయడమే సమస్యకు కారణమైంది. ఇది జగన్ బెయిల్ రద్దుకు పరిస్థితులు సృష్టించడం కాదా? గత్యంతరం లేక లీగల్ స్టెప్ తీసుకున్నారు. జగన్ పదేళ్లలో రూ.200Cr షర్మిలకు ఇచ్చారు’ అని తెలిపింది.