News October 24, 2024
వార్-2లో షారుఖ్ ఖాన్?
ఎన్డీఆర్, హృతిక్ రోషన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ‘వార్2’ సినిమా గురించి ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకొచ్చింది. బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ ఈ చిత్రంలో కీలక పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం. తన పాత్రకు సంబంధించి షూటింగ్ సైతం ప్రారంభించినట్లు సినీ వర్గాలు పేర్కొన్నాయి. దీంతో ముగ్గురు అగ్రహీరోలను ఒకే ఫ్రేమ్లో చూసేందుకు ఎదురుచూస్తున్నామని ఫ్యాన్స్ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.
Similar News
News October 24, 2024
రేపటి నుంచి అమెరికా పర్యటనకు లోకేశ్
AP: రాష్ట్రానికి పెట్టుబడులు ఆకర్షించేందుకు గాను మంత్రి నారా లోకేశ్ అమెరికా పర్యటనకు వెళ్లనున్నారు. రేపటి నుంచి నవంబర్ 1వరకు ఆయన అగ్రరాజ్యంలో పర్యటిస్తారు. ఇందులో భాగంగా గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్, ఒరాకిల్, సేల్స్ఫోర్స్, పెప్సికో వంటి దిగ్గజ ఐటీ కంపెనీల ప్రతినిధులతో ఆయన సమావేశమవుతారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు గల అవకాశాలను వారికి వివరించనున్నారు.
News October 24, 2024
కరెంట్ ఛార్జీల పెంపుపై కీలక ప్రకటన
TG: రాష్ట్రంలో సామాన్యులపై కరెంట్ ఛార్జీలు పెంచబోమని డిస్కం సీఎండీ ముషారఫ్ స్పష్టం చేశారు. హైటెన్షన్ ఇండస్ట్రియల్ వినియోగదారులపై కూడా ఛార్జీల భారం పడదని చెప్పారు. నెలకు 300 యూనిట్లకు పైగా వినియోగదారులకు ఫిక్స్డ్ ఛార్జీల రూపంలో రూ.50 పెంపు కోసం ప్రతిపాదించామని తెలిపారు. రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీలు పెరగబోతున్నాయంటూ ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ముషారఫ్ ఇలా స్పందించారు.
News October 24, 2024
శ్రీశైలం వెళ్లే భక్తులకు గమనిక
AP: కార్తీక మాసోత్సవాల సందర్భంగా శ్రీశైలం దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. కార్తీక శని, ఆది, సోమ, పౌర్ణమి, ఏకాదశి రోజులలో సామూహిక, గర్భాలయ అభిషేకాలు, స్పర్శ దర్శనాలను రద్దు చేసింది. ఆయా రోజులలో స్వామివారి అలంకార దర్శనానికే అనుమతిచ్చింది. సాధారణ రోజులలో అభిషేకాలు, స్పర్శ దర్శనాలు మూడు విడతలుగా అందుబాటులో ఉండనున్నాయి. కాగా నవంబర్ 2 నుంచి డిసెంబర్ 1 వరకు శ్రీశైలంలో కార్తీక మాసోత్సవాలు జరగనున్నాయి.