News October 24, 2024

నేడు విజయనగరం జిల్లాలో జగన్ పర్యటన

image

AP: విజయనగరం జిల్లా గుర్లలో మాజీ సీఎం జగన్ ఇవాళ పర్యటించనున్నారు. ఉదయం 9గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి 11 గంటలకు అక్కడికి చేరుకుంటారు. డయేరియాతో మృతి చెందిన కుటుంబాలను, ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను ఆయన పరామర్శిస్తారు. కాగా గుర్లలో అతిసారం బారిన పడి ఏడుగురు మృతి చెందిన సంగతి తెలిసిందే.

Similar News

News October 24, 2024

ఖరీదైన ఇళ్లు కూల్చి డబుల్ బెడ్రూం ఇళ్లు ఇస్తారా?: అక్బరుద్దీన్

image

TG: మూసీ పునరుజ్జీవంలో భాగంగా ఇళ్లు కోల్పోతున్న నిర్వాసితులను MIM నేత అక్బరుద్దీన్ కలిశారు. ఖరీదైన ఇళ్లను కూల్చేసి వారికి డబుల్ బెడ్రూం ఇళ్లు ఇస్తారా? అని ప్రశ్నించారు. అలా చేస్తే కుదరదని తేల్చి చెప్పారు. తామెప్పుడూ ప్రభుత్వాలకు తలొగ్గలేదని, అన్ని రాజకీయ పార్టీలు మూసీపై రాజకీయం చేస్తున్నాయని మండిపడ్డారు. నిర్వాసితులు వారి వ్యాపారాలు ఇక్కడుంటే ఎక్కడికో ఎలా వెళతారని ఆయన ప్రశ్నించారు.

News October 24, 2024

BSNL కనెక్టింగ్ భారత్‌పై నెటిజన్ల చర్చ ఎలా ఉందంటే!

image

BSNL కొత్త లోగోపై సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. లోగోలో భారత్ మ్యాప్‌ను ఉంచడం, కనెక్టింగ్ ఇండియా ట్యాగ్‌లైన్‌ను కనెక్టింగ్ భారత్‌గా మార్చడం బాగుందని కొందరు అంటున్నారు. భారతీయత కనిపిస్తోందని చెప్తున్నారు. మార్చాల్సింది లోగో కాదని, బిజినెస్ స్ట్రక్చర్, అందించాల్సిన సేవలని మరికొందరు విమర్శిస్తున్నారు. ఇంకెప్పుడు 4G, 5G అందిస్తారని ప్రశ్నిస్తున్నారు. DD లోగో మార్చినప్పుడూ ఇలాంటి కామెంట్సే వచ్చాయి.

News October 24, 2024

పోలవరం డయాఫ్రమ్ వాల్‌ను అప్పటిలోగా పూర్తి చేయాలి: సీఎం

image

AP: పోలవరం డయాఫ్రమ్ వాల్ నిర్మాణం 2026 మార్చిలోగా పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని బావర్ కంపెనీ ప్రతినిధులను CM చంద్రబాబు ఆదేశించారు. సాగునీటి ప్రాజెక్టుల నిర్వహణ కోసం ఏటా ₹983 కోట్లు ఖర్చు పెట్టాల్సి ఉండగా గత ప్రభుత్వం 5 ఏళ్లలో కేవలం ₹275 కోట్లు మాత్రమే ఖర్చు చేసిందని జల వనరుల శాఖ సమీక్షలో తెలిపారు. ఇక నుంచి అలా జరగరాదని, ఈ ఏడాదికి అవసరమైన మొత్తం నిధులను ఏకకాలంలో ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.