News October 24, 2024

జగన్ హయాంలోనే డ్రోన్ల వినియోగం: YCP

image

AP: కష్టం ఎవరిదైనా క్రెడిట్ కొట్టేయడంలో శాడిస్ట్ చంద్రబాబుది అందెవేసిన చేయి అంటూ వైసీపీ విమర్శించింది. వైఎస్ జగన్ హయాంలో డ్రోన్లని విరివిగా వాడినా ఇప్పుడు ఆ ఘనత తనదేనంటూ చంద్రబాబు గప్పాలు కొడుతున్నారని మండిపడింది. ఇదంతా జనం చూసి నవ్విపోతారనే సోయి లేకపోతే ఎలా అంటూ ట్వీట్ చేసింది. జగన్ హయాంలో ఎరువులు, విత్తనాలు చల్లేందుకు డ్రోన్లను వాడినట్లు పేర్కొంది.

Similar News

News October 24, 2024

సైకిల్ గుర్తుపై పోటీ చేయ‌నున్న కాంగ్రెస్ అభ్య‌ర్థులు

image

UPలో 9 అసెంబ్లీ స్థానాల‌ ఉపఎన్నిక‌ల్లో పోటీపై ఇండియా కూట‌మి అనూహ్య నిర్ణ‌యం తీసుకుంది. కాంగ్రెస్ అభ్య‌ర్థులు కూడా స‌మాజ్‌వాదీ పార్టీ ‘సైకిల్’ గుర్తు మీద పోటీ చేయ‌నున్నారు. ఈ మేర‌కు రాహుల్‌తో చ‌ర్చించాక అఖిలేశ్ యాద‌వ్ వెల్ల‌డించారు. సీట్ల పంప‌కాల కంటే గెలుపే ల‌క్ష్యంగా ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్టు తెలిపారు. 9 స్థానాల్లో 7 చోట్ల‌ ఎస్పీ, 2 చోట్ల కాంగ్రెస్ అభ్య‌ర్థులు సైకిల్ గుర్తుపై పోటీ చేయనున్నారు.

News October 24, 2024

అందుకే రైల్వే ప్రాజెక్టుల ఆలస్యం: కిషన్‌రెడ్డి

image

రాష్ట్రాలు వాటా ఇవ్వకపోవడంతో కొన్ని రైల్వే ప్రాజెక్టులు ఆలస్యమవుతున్నాయని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. దక్షిణ మధ్య రైల్వేలో 40 స్టేషన్లను ఆధునీకరిస్తామని ఆయన వెల్లడించారు. కాజీపేటలో రూ.680కోట్లతో తయారీ యూనిట్ రాబోతోందన్నారు. రాష్ట్రం నుంచి సహకారం లేకపోయినా రూ.650కోట్లతో MMTS పొడిగిస్తామన్నారు.

News October 24, 2024

గ్రూప్-1, గ్రూప్-2పై ఏపీపీఎస్సీ ఛైర్‌పర్సన్ ఆరా

image

AP: ఏపీపీఎస్సీ ఛైర్‌పర్సన్‌గా రిటైర్డ్ ఐపీఎస్ ఏఆర్ అనురాధ బాధ్యతలు స్వీకరించారు. విజయవాడలోని ఏపీపీఎస్సీ కార్యాలయంలో ఫైల్‌పై సంతకం చేశారు. అనంతరం పెండింగ్ లో ఉన్న నియామకాలపై బోర్డు సభ్యులు, అధికారులతో రివ్యూ చేశారు. గ్రూప్-1, గ్రూప్-2 సహా పలు పరీక్షలు, ఇంటర్వ్యూలపై ఆరా తీశారు. కొత్తగా ఇవ్వాల్సిన నోటిఫికేషన్లపై వీలైనంత త్వరగా నిర్ణయాలు తీసుకుంటామని అనురాధ తెలిపారు.