News October 24, 2024
భారీగా వర్షాలు.. అప్రమత్తంగా ఉండాలి: సీఎం
AP: భారీగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. వర్షాలపై జిల్లా కలెక్టర్లతో ఆయన ఇవాళ ఉదయం సమీక్ష నిర్వహించారు. ఉమ్మడి నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయని అధికారులు సీఎంకు వివరించారు. నేడూ భారీ వర్షాలున్న నేపథ్యంలో సాగునీటి ప్రాజెక్టుల్లో నీటి ప్రవాహాలు, చెరువులు, వాగుల పరిస్థితిపై అప్రమత్తంగా ఉండాలని అధికారులకు సీఎం సూచించారు.
Similar News
News October 24, 2024
సైకిల్ గుర్తుపై పోటీ చేయనున్న కాంగ్రెస్ అభ్యర్థులు
UPలో 9 అసెంబ్లీ స్థానాల ఉపఎన్నికల్లో పోటీపై ఇండియా కూటమి అనూహ్య నిర్ణయం తీసుకుంది. కాంగ్రెస్ అభ్యర్థులు కూడా సమాజ్వాదీ పార్టీ ‘సైకిల్’ గుర్తు మీద పోటీ చేయనున్నారు. ఈ మేరకు రాహుల్తో చర్చించాక అఖిలేశ్ యాదవ్ వెల్లడించారు. సీట్ల పంపకాల కంటే గెలుపే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. 9 స్థానాల్లో 7 చోట్ల ఎస్పీ, 2 చోట్ల కాంగ్రెస్ అభ్యర్థులు సైకిల్ గుర్తుపై పోటీ చేయనున్నారు.
News October 24, 2024
అందుకే రైల్వే ప్రాజెక్టుల ఆలస్యం: కిషన్రెడ్డి
రాష్ట్రాలు వాటా ఇవ్వకపోవడంతో కొన్ని రైల్వే ప్రాజెక్టులు ఆలస్యమవుతున్నాయని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి అన్నారు. దక్షిణ మధ్య రైల్వేలో 40 స్టేషన్లను ఆధునీకరిస్తామని ఆయన వెల్లడించారు. కాజీపేటలో రూ.680కోట్లతో తయారీ యూనిట్ రాబోతోందన్నారు. రాష్ట్రం నుంచి సహకారం లేకపోయినా రూ.650కోట్లతో MMTS పొడిగిస్తామన్నారు.
News October 24, 2024
గ్రూప్-1, గ్రూప్-2పై ఏపీపీఎస్సీ ఛైర్పర్సన్ ఆరా
AP: ఏపీపీఎస్సీ ఛైర్పర్సన్గా రిటైర్డ్ ఐపీఎస్ ఏఆర్ అనురాధ బాధ్యతలు స్వీకరించారు. విజయవాడలోని ఏపీపీఎస్సీ కార్యాలయంలో ఫైల్పై సంతకం చేశారు. అనంతరం పెండింగ్ లో ఉన్న నియామకాలపై బోర్డు సభ్యులు, అధికారులతో రివ్యూ చేశారు. గ్రూప్-1, గ్రూప్-2 సహా పలు పరీక్షలు, ఇంటర్వ్యూలపై ఆరా తీశారు. కొత్తగా ఇవ్వాల్సిన నోటిఫికేషన్లపై వీలైనంత త్వరగా నిర్ణయాలు తీసుకుంటామని అనురాధ తెలిపారు.